కొన్ని కథలు సాధారణంగా అనిపించినా.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి సినిమాను ఎంగేజింగ్గా మారుస్తుంటారు దర్శకులు. కొన్ని కథల్లో విషయం ఉన్నా.. సరైన స్క్రీన్ ప్లే లేక.. తెర మీద ఆ కథను ప్రెజెంట్ చేయడంలో తడబాటు వల్ల తేడా కొడుతుంటాయి. గురువారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పై’ సినిమా రెండో కోవకే చెందుతుంది.
ఈ చిత్ర ట్రైలర్ చూసిన వాళ్లు సినిమా గురించి చాలానే ఊహించుకున్నారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా మారిన గ్యారీ బీహెచ్.. టీజర్, ట్రైలర్ కట్ చేయడంలో తన నైపుణ్యాన్ని బాగానే చూపించాడు. ఒక రేసీ థ్రిల్లర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి టీజర్, ట్రైలర్. సినిమాలోని బెస్ట్ షాట్స్ తీసుకుని ఒక టాప్ నాచ్ థ్రిల్లర్ సినిమా తరహాలో టీజర్, ట్రైలర్లు కట్ చేశాడు గ్యారీ. కానీ సినిమాలో ఆ వేగం.. ఆ మెరుపులు కనిపించలేదు.
ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ యాంగిల్ గురించి ప్రేక్షకులు ఏదో ఊహించుకున్నారు. కానీ ఆయన పాత్రను సరిగా వాడుకోలేదు. ఆ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ చూస్తే.. ఇది విషయం ఉన్న కథే అనిపిస్తుంది. కథకుడు మంచి పాయింటే పట్టుకున్నాడు అనిపిస్తుంది. కానీ ఆయన మరణం, ఇతర విషయాలకు సంబంధించిన ఫైల్స్కు.. ఈ కథకు ముడిపెట్టి పకడ్బందీ కథనాన్ని అల్లడంలో.. తెరపై ఈ థ్రెడ్ను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు, అతడి టీం ఫెయిలైంది.
ఒక థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన ఇంటెన్సిటీ, ఉత్కంఠ ఇందులో మిస్సయ్యాయి. తెలుగులో థ్రిల్లర్ సినిమాలంటే అందరికీ అడివి శేషే గుర్తుకొస్తాడు. మంచి రైటర్ కూడా అయిన అతను.. ఏ దర్శకుడితో పని చేసినా.. స్క్రీన్ ప్లే విషయంలో మంచి కసరత్తు చేసి పకడ్బందీగా స్క్రిప్టు తీర్చిదిద్దుకుంటాడు. అందుకోసం చాలా టైం పెడతాడు. ఇక ఎగ్జిక్యూషన్ కూడా అదిరిపోతుంది. లూజ్ ఎండ్స్ లేకుండా.. లూప్ హోల్స్ లేకుండా రేసీగా స్క్రీన్ ప్లే రాయడం.. సినిమాను పరుగెత్తించడంలో శేష్ స్టైలే వేరు. ‘స్పై’ లాంటి పాయింట్ను శేష్కు అప్పగించి ఉంటే మాత్రం దీన్ని వేరే లెవెల్కు తీసుకెళ్లి ఉండేవాడు అనడంలో సందేహం లేదు.
This post was last modified on June 29, 2023 10:23 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…