అప్పుడెప్పుడో పదిహేడేళ్ల క్రితం స్టాలిన్ లో చిరంజీవితో ఆడిపాడిన త్రిష మళ్ళీ ఆ తర్వాత జట్టుకట్టలేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మించబోయే ఎంటర్ టైనర్ లో మరోసారి జోడిగా కనిపించనుందనే వార్త ఇప్పటికే వైరల్ అయ్యింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో చిరుది రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాదు. సిద్దు జొన్నలగడ్డకు తండ్రిగా కనిపిస్తారట. అయితే బలమైన ఎమోషన్లు, సెంటిమెంట్లు కానీ ఏమి లేకుండా క్లీన్ కామెడీతో ఆద్యంతం నవ్వించేలా ప్రసన్న కుమార్ కథను రాసినట్టు ఇన్ సైడ్ టాక్.
అలాంటప్పుడు త్రిష వేసేది తల్లి పాత్ర అవుతుంది. ఒకపక్క తమిళంలో లియో లాంటి సినిమాల్లో స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశాలు వస్తున్నప్పుడు టాలీవుడ్ లో వయసు మళ్ళిన క్యారెక్టర్ ఎందుకు చేస్తారనే సందేహం రావడం సహజం. ఇక్కడే ఉంది అసలు మెలిక. సిద్దుకి చిరు తండ్రే కానీ త్రిష అమ్మ కాదట. అంటే మెగాస్టార్ కు రెండో భార్యగా కావడం కోసం సిద్దు తాపత్రయపడే టైపు ట్విస్టు సెట్ చేశారని తెలిసింది. అలా అయితే ఇబ్బంది లేదు. పైగా ఎంటర్ టైన్మెంట్ ఫ్లోలో ఆ విషయం ప్రేక్షకులు గుర్తించలేనంత వేగంగా స్క్రీన్ ప్లే ఉంటుందని వినికిడి.
త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమా రిలీజ్ ని 2024 సంక్రాంతికి ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అసలు షూటింగ్ మొదలు కాకుండానే అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే లొకేషన్స్ మొత్తం హైదరాబాద్ లోనే సెట్ చేస్తారట. ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఇవేవి ఉండవు కాబట్టి స్పష్టమైన టార్గెట్ తో మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసేలా స్కెచ్ వేస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్ట్ కె వాయిదా దాదాపు లాంఛనమే కాబట్టి గుంటూరు కారంతో పాటు కర్చీఫ్ వేయాలని మెగా టీమ్ ప్లాన్. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇదేమంత కష్టం కాదు. చేరుకోవచ్చు.
This post was last modified on October 8, 2023 4:38 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…