Movie News

అసిన్ విడాకులు తీసుకుంటోందా?

తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని కథానాయిక అసిన్. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’తో తెలుగులో అడుగు పెట్టి అనేక పెద్ద సినిమాల్లో నటించిందామె. ఐతే కెరీర్ ఇంకా కొనసాగుతుండగానే ఈ మలయాళ కుట్టి మైక్రోమ్యాక్స్ మొబైల్ కంపెనీ అధినేత రాహుల్ శర్మతో ప్రేమలో పడటం.. అతణ్ని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడటం తెలిసిందే.

2016లో ఈ జంట పెళ్లి చేసుకున్నాక అసిన్ లైమ్ లైట్లో లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు విడాకుల ప్రచారంతో అసిన్ వార్తల్లోకి వచ్చింది అసిన్. తన భర్తతో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి అసిన్ తొలగించడం ఈ ప్రచారానికి దారి తీసింది. ఐతే తాను విడాకులు తీసుకోబోతున్న వార్త నిజం కాదని అసిన్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.

‘‘వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న సమయంలో కొన్ని నిరాధారమైన వార్తలు మా కంట పడ్డాయి. వాటిని చూశాక.. పెళ్లి కోసం ఇద్దరి కుటుంబాల పెద్దలను ఒప్పించిన రోజులు గుర్తుకు వచ్చాయి. మేం విడిపోతున్నామంటూ వచ్చిన వార్త్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి కాస్త ఆలోచించి వార్తలు రాయండి. అద్భుతమైన హాలిడేలో ఇలాంటి వాటి కోసం ఐదు నిమిషాలు వృథా చేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా’’ అని అసిన్ తెలిపింది.

‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తర్వాత అసిన్.. తెలుగులో నాగార్జున సరసన ‘శివమణి’.. వెంకటేష్‌కు జోడీగా ‘ఘర్షణ’.. బాలకృష్ణ సరసన ‘లక్ష్మీ నరసింహా’ లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో ఆమె చేసిన ‘గజినీ’; ‘పోకిరి’ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. హిందీలో సైతం ‘గజినీ’ రీమేక్ సహా పలు భారీ చిత్రాల్లో అసిన్ నటించింది. చివరగా ఆమె ‘హౌస్ ఫుల్-2’, ‘లండన్ డ్రీమ్స్’ చిత్రాల్లో మెరిసింది.

This post was last modified on June 28, 2023 6:52 pm

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

13 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 hour ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago