గత ఏడాది నిఖిల్ సినిమా ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. రిలీజ్ ముంగిట ఆ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా పేర్కొన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల అవతల దానికి ఏమాత్రం క్రేజ్ కనిపించలేదు. ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. హిందీలో నామమాత్రంగా సినిమాను రిలీజ్ చేశారు. కానీ విడుదల తర్వాత ఆ చిత్రానికి ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది.
పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. థియేటర్లు, షోల సంఖ్య పెరుగుతూ పోయింది. అంతిమంగా సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లతో పాన్ ఇండియా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘స్పై’ను కూడా నిఖిల్ పాన్ ఇండియా సినిమాగానే చెబుతున్నాడు. నాలుగు భాషల్లో రిలీజ్ చేయిస్తున్నాడు. మరి ‘కార్తికేయ-2’ లాగా ఇది కూడా మ్యాజిక్ చేస్తుందా అన్నది సందేహం.
‘కార్తికేయ-2’కు అనుసరించిన స్ట్రాటజీనే ‘స్పై’ విషయంలోనూ నిఖిల్ అనుసరిస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల అవతలేమీ క్రేజ్ లేదు. నిఖిల్ సైతం రాష్ట్రాలు తిరిగి ఈ సినిమానేమీ ప్రమోట్ చేయట్లేదు. కేవలం కంటెంటే ఈ సినిమాకు ఆదరణ పెంచుతుందని నమ్ముతున్నాడు నిఖిల్. హిందీలో సినిమాకు ఢిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. వాటికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
రిలీజ్కు ముందు రోజు థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక తమిళంలో అయితే చెన్నై లాంటి పెద్ద సిటీలో ‘స్పై’కి వీకెండ్ అంతా కలిపి పది షోలు కూడా లేవు. ఇక మలయాళ వెర్షన్కు కోచి సిటీలో ఇంకా తక్కువ షోలు ఇచ్చారు. బెంగళూరులో కన్నడ వెర్షనే అందుబాటులో లేదు. తెలుగు షోలే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఏపీ, తెలంగాణ అవతల ‘స్పై’ రిలీజ్ నామమాత్రమే. మరి ఈ సినిమాకు కూడా ‘కార్తికేయ-2’ లాగే పాజిటివ్ టాక్ వచ్చి.. ఆక్యుపెన్సీలు పెరిగిపోయి.. పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on June 28, 2023 5:25 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…