గత ఏడాది నిఖిల్ సినిమా ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. రిలీజ్ ముంగిట ఆ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా పేర్కొన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల అవతల దానికి ఏమాత్రం క్రేజ్ కనిపించలేదు. ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు. హిందీలో నామమాత్రంగా సినిమాను రిలీజ్ చేశారు. కానీ విడుదల తర్వాత ఆ చిత్రానికి ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది.
పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. థియేటర్లు, షోల సంఖ్య పెరుగుతూ పోయింది. అంతిమంగా సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లతో పాన్ ఇండియా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘స్పై’ను కూడా నిఖిల్ పాన్ ఇండియా సినిమాగానే చెబుతున్నాడు. నాలుగు భాషల్లో రిలీజ్ చేయిస్తున్నాడు. మరి ‘కార్తికేయ-2’ లాగా ఇది కూడా మ్యాజిక్ చేస్తుందా అన్నది సందేహం.
‘కార్తికేయ-2’కు అనుసరించిన స్ట్రాటజీనే ‘స్పై’ విషయంలోనూ నిఖిల్ అనుసరిస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల అవతలేమీ క్రేజ్ లేదు. నిఖిల్ సైతం రాష్ట్రాలు తిరిగి ఈ సినిమానేమీ ప్రమోట్ చేయట్లేదు. కేవలం కంటెంటే ఈ సినిమాకు ఆదరణ పెంచుతుందని నమ్ముతున్నాడు నిఖిల్. హిందీలో సినిమాకు ఢిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. వాటికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
రిలీజ్కు ముందు రోజు థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక తమిళంలో అయితే చెన్నై లాంటి పెద్ద సిటీలో ‘స్పై’కి వీకెండ్ అంతా కలిపి పది షోలు కూడా లేవు. ఇక మలయాళ వెర్షన్కు కోచి సిటీలో ఇంకా తక్కువ షోలు ఇచ్చారు. బెంగళూరులో కన్నడ వెర్షనే అందుబాటులో లేదు. తెలుగు షోలే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఏపీ, తెలంగాణ అవతల ‘స్పై’ రిలీజ్ నామమాత్రమే. మరి ఈ సినిమాకు కూడా ‘కార్తికేయ-2’ లాగే పాజిటివ్ టాక్ వచ్చి.. ఆక్యుపెన్సీలు పెరిగిపోయి.. పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on June 28, 2023 5:25 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…