లేటు వయసులో ఒక్కసారిగా హాట్నెస్ పెంచేసి కుర్రాళ్లలో కాక పుట్టిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవలే అమేజాన్ ప్రైమ్లో రిలీజైన ‘జీ కర్దా’లో ఆమె చేసిన హాట్ సీన్లు కొన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మరో ‘హాట్’ సిరీస్తో తమన్నా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ఓ కీలక పాత్ర చేసిన ‘లస్ట్ స్టోరీస్-2’ ఈ గురువారమే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతోంది.
నిజ జీవితంలో తమన్నాతో రిలేషన్షిప్లో ఉన్నట్లుగా భావిస్తున్న విజయ్ వర్మనే ఇందులో ఆమెతో జోడీ కొట్టాడు. ఒక ఎపిసోడ్ వీరి మీదే నడవబోతోంది. తమన్నా ఒక వివాహితగా కనిపించనుండగా.. ఆమె మాజీ లవర్ అయిన విజయ్ తన జీవితంలోకి రీఎంట్రీ ఇచ్చి తనతో మళ్లీ రొమాన్స్ చేయాలని ప్రయత్నించే నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నడుస్తుందని ప్రోమోలు చూస్తే అర్థమవుతున్నాయి.
ఈ షోను తమన్నా కొంచెం వెరైటీగా ప్రమోట్ చేయాలని చూడటం విమర్శలకు దారి తీస్తోంది. లస్ట్ స్టోరీస్-2 ప్రధానంగా యూత్ను టార్గెట్ చేసిందని వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రధానంగా సెక్స్ చుట్టూ తిరిగే ఇలాంటి షోలను ఫ్యామిలీ అంతా చూసేంత ప్రొగ్రెసివ్ సొసైటీ కాదు మనది. కానీ తమన్నా మాత్రం ఈ షోను ఫ్యామిలీలో అందరూ కలిసి చూడమని అంటోంది.
పైగా తనకు, విజయ్కి మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సీన్ చూపించి మరి.. ఈ షోను రహస్యంగా చూడాల్సిన పని లేదని.. ఇందులో అందరి కథలూ ఉంటాయని.. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని ఆమె సెలవిచ్చింది. కానీ నెటిజన్లకు ఈ అప్పీల్ రుచించలేదు. రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లను ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేంత సీన్ మన దగ్గర లేదని.. తమన్నా ఇప్పుడు ఇమేజ్ మార్చుకుని ఇలాంటి సిరీస్ల్లో నటిస్తే నటించింది కానీ… జనాలకు ఇలాంటి సలహాలు మాత్రం ఇవ్వొద్దని ఆమెకు గట్టిగా చెబుతున్నారు.
This post was last modified on June 28, 2023 5:08 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…