Movie News

తమన్నా ప్రమోషన్‌పై ట్రోలింగ్

లేటు వయసులో ఒక్కసారిగా హాట్నెస్ పెంచేసి కుర్రాళ్లలో కాక పుట్టిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవలే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘జీ కర్దా’లో ఆమె చేసిన హాట్ సీన్లు కొన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మరో ‘హాట్’ సిరీస్‌తో తమన్నా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ఓ కీలక పాత్ర చేసిన ‘లస్ట్ స్టోరీస్-2’ ఈ గురువారమే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది.

నిజ జీవితంలో తమన్నాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా భావిస్తున్న విజయ్ వర్మనే ఇందులో ఆమెతో జోడీ కొట్టాడు. ఒక ఎపిసోడ్ వీరి మీదే నడవబోతోంది. తమన్నా ఒక వివాహితగా కనిపించనుండగా.. ఆమె మాజీ లవర్‌ అయిన విజయ్ తన జీవితంలోకి రీఎంట్రీ ఇచ్చి తనతో మళ్లీ రొమాన్స్ చేయాలని ప్రయత్నించే నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నడుస్తుందని ప్రోమోలు చూస్తే అర్థమవుతున్నాయి.

ఈ షోను తమన్నా కొంచెం వెరైటీగా ప్రమోట్ చేయాలని చూడటం విమర్శలకు దారి తీస్తోంది. లస్ట్ స్టోరీస్-2 ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసిందని వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రధానంగా సెక్స్ చుట్టూ తిరిగే ఇలాంటి షోలను ఫ్యామిలీ అంతా చూసేంత ప్రొగ్రెసివ్ సొసైటీ కాదు మనది. కానీ తమన్నా మాత్రం ఈ షోను ఫ్యామిలీలో అందరూ కలిసి చూడమని అంటోంది.

పైగా తనకు, విజయ్‌కి మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సీన్‌‌ చూపించి మరి.. ఈ షోను రహస్యంగా చూడాల్సిన పని లేదని.. ఇందులో అందరి కథలూ ఉంటాయని.. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని ఆమె సెలవిచ్చింది. కానీ నెటిజన్లకు ఈ అప్పీల్ రుచించలేదు. రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లను ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేంత సీన్ మన దగ్గర లేదని.. తమన్నా ఇప్పుడు ఇమేజ్ మార్చుకుని ఇలాంటి సిరీస్‌ల్లో నటిస్తే నటించింది కానీ… జనాలకు ఇలాంటి సలహాలు మాత్రం ఇవ్వొద్దని ఆమెకు గట్టిగా చెబుతున్నారు.

This post was last modified on June 28, 2023 5:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago