ఇండియన్ సినిమాలకు ఇప్పుడు పెద్ద బెంచ్ మార్క్ వంద కోట్లుగా ఉంది. తొలి రోజు కొన్ని భారీ చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నాయి. ప్రభాస్ కొత్త చిత్రం ఆదిపురుష్ ఇటీవల తొలి రోజు రూ.140 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. ఐతే ప్రభాస్ రాబోయే సినిమా ప్రాజెక్ట్ కే ఏకంగా తొలి రోజే రూ.500 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆ సినిమా మేకింగ్ చూసి తనకు ఆ ధీమా కలుగుతున్నట్లు ఆయన చెప్పారు.
ఇటీవల రెండు సార్లు తాను ‘ప్రాజెక్ట్ K’ సెట్స్కి వెళ్లానని.. వాళ్తు తీస్తున్న విధానం బాగుందని తమ్మారెడ్డి అన్నారు. సరైన పద్ధతిలో ప్రచారం చేస్తే ఈ సినిమా గ్లోబల్ స్టాయిలో టాప్-50 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. అది వైజయంతీ మూవీస్ ప్రచార కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. సరైన పద్ధతిలో ప్రమోట్ చేస్తే తొలి రోజు ఈ సినిమా రూ.500 నుంచి రూ.600 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందన్నారు తమ్మారెడ్డి. సినిమా బాగుంటే కచ్చితంగా హాలీవుడ్ టాప్ సినిమాల జాబితాలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలుగులో ఒకప్పుడు రూ.30 కోట్లు, రూ.40 కోట్లు వస్తే చాలా ఎక్కువ అనుకునేవాళ్లమని.. ‘ఇంద్ర’ సినిమాకు రూ.30 కోట్లు వస్తే గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు.. చిరు రేంజికి రూ.100 కోట్ల వసూళ్లు రావాలని ఆయన దగ్గర అన్నానని.. కానీ అది చాలా కష్టం అనుకుంటే.. ‘బాహుబలి’తో రాజమౌళి రూ.1000 కోట్లు చాలా ఈజీగా రాబట్టి చూపించాడని… ‘కె.జి.యఫ్’, ‘కె.జి.యఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు కూడా భారీగా వసూళ్లు రాబట్టాయని..ప్రాజెక్ట్ కే వీటన్నింటినీ మించి ప్రపంచ స్థాయిలో వేల కోట్లు వసూలు చేస్తుందని తమ్మారెడ్డి అన్నారు.
This post was last modified on June 27, 2023 11:47 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…