ఆదిపురుష్.. ఈ మధ్య కాలంలో తీవ్ర వివాదాస్పదమైన సినిమా. టీజర్ రిలీజైనపుడే ఈ సినిమా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది కానీ.. తర్వాత ఎలాగోలా ఆ నెగెటివిటీని జయించారు. రిలీజ్ ముంగిట మంచి బజ్ తీసుకురాగలిగారు. కానీ రిలీజ్ తర్వాత సినిమా తీవ్రాతి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమాలో రావణుడు సహా వివిధ పాత్రలను ప్రెజెంట్ చేసిన తీరు.. అనేక సన్నివేశాలు.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రామాయాణాన్ని చెడగొట్టారనే చర్చ నడిచింది. వీకెండ్ వరకు సత్తా చాటిన ఈ చిత్రం ఆ తర్వాత ఈ నెగెటివిటీని తట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టు కేసులు కూడా చిత్ర బృందానికి తలపోటుగా మారాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ మీద విచారించిన కోర్టు.. ఆదిపురుష్ టీం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు బుర్ర లేని వాళ్లు అనుకుంటున్నారా అంటూ మేకర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సినిమా చూశాక కూడా ప్రజలు లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ రానివ్వలేదు అంటే ప్రజలని మెచ్చుకోవాలి అని కోర్టు వ్యాఖ్యానించింది. హనుమంతుడిని సీతని దేనికి పనికిరాని వాళ్లలాగా చూపించారని కోర్టు వ్యాఖ్యానించింది.
అంతే కాక సినిమాలో డైలాగ్స్ మార్చడంపై స్పందిస్తూ.. మరి సీన్లు ఎవరు మారుస్తారు అని ప్రశ్నించింది. రాముడిని, రావణుడిని, లంకని, ఆంజనేయుడిని చూపించి ఇది రామాయణం కాదు అంటే చూసే ప్రజలు బుర్రలేని వాళ్ళు అనుకున్నార్రా అని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఐతే ఆదిపురుష్ టీం మీద కోర్టు చర్యలేమీ సూచించలేదు. మందలింపుతో సరిపెట్టినట్లుగా తెలుస్తోంది. అయినా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిన చిత్రంపై ఇప్పుడు ఏ చర్యలు తీసుకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండకపోవచ్చు.
This post was last modified on June 27, 2023 11:44 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…