ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీస్లో ఒకటైన ప్రాజెక్ట్-కే సినిమాకు సంబంధించి ఈ రోజు బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కమల్ ఈ ప్రాజెక్టులో భాగం కావడం పట్ల ప్రభాస్ తన ఎగ్జైట్మెంట్ను బయట పెట్టాడు. కమల్ సైతం ఈ సినిమా చేస్తుండటం తన అదృష్టం అన్నట్లుగా మాట్లాడాడు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్, దీపికా పదుకొనే లాంటి పేరు మోసిన హీరోయిన్ ఉండటంతో ఈ సినిమా లెవెలే వేరుగా ఉంది. ఇప్పుడు కమల్ కూడా రావడంతో సినిమా స్కేల్ ఇంకా పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇంతకీ ఈ చిత్రంలో కమల్ పాత్రేంటి అనే విషయంలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇందులో ఆయన విలన్ పాత్ర చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
సినిమాలో అమితాబ్ బచ్చన్ విలన్ పాత్ర చేసే అవకాశం దాదాపుగా లేనట్లే. ఆయనది ప్రభాస్ను వెనక ఉండి నడిపించే మెంటార్ తరహా సైంటిస్టు పాత్రగా చెబుతున్నారు. ఐతే సైంటిస్టులైన కమల్, అమితాబ్ కలిసి ఒక అద్భుతం లాంటి ఆవిష్కరణ చేస్తారని.. దాన్ని మానవాళి మంచికి ఉపయోగించాలన్నది అమితాబ్ ఉద్దేశమైతే.. దాన్ని కమల్ ప్రపంచ వినాశనానికి ఉపయోగిస్తాడట.
ఆ పరిస్థితుల్లో ప్రభాస్ను ఒక ఆయుధంలో కమల్ మీదికి అమితాబ్ ప్రయోగిస్తాడని సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం జరుగుతోంది. కాన్సెప్ట్ విషయంలో ఈ ప్రచారం ఎంత వరకు నిజమో కానీ.. కమల్ నెగెటివ్ షేడ్స్ను కూడా గొప్పగా పండించగలడు కాబట్టి ఆయన విలన్ పాత్ర చేస్తే ఆ పాత్రకు వచ్చే ఎలివేషనే వేరుగా ఉంటుందని.. కమల్ లాంటి విలన్ను ఢీకొడితే ప్రభాస్ పాత్ర కూడా షైన్ అవుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
This post was last modified on June 26, 2023 11:33 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…