వెరైటీ కథలు, ప్రయోగాలతో పాటు ప్రేక్షకుల మెప్పులు పొందుతాడని పేరున్న శ్రీవిష్ణు కొత్త సినిమా సామజవరగమన ఈ శుక్రవారమే థియేటర్లలో అడుగు పెట్టనుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ ట్రైలర్ ని ఇవాళ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. టీమ్ ప్రత్యేకంగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నిజానికీ మూవీ మొన్న నెలే రావాల్సి ఉన్నా పోటీ తదితర కారణాల వల్ల కాస్త లేట్ అయ్యింది. ఇంతకీ ట్రైలర్ లో కంటెంట్ ఆసక్తి పెంచేలా ఉందా .
మల్టీప్లెక్సులో పనిచేసే బాక్సాఫీస్ బాలు(శ్రీవిష్ణు) మధ్యతరగతి జీవి. కుటుంబ సభ్యులు సినిమాకు వచ్చినా సరే కనీసం పాప్ కార్న్ టబ్బు కొనాలన్నా నో అనే రకం. మహా పిసినారి. అలాంటి వాడి లైఫ్ లోకి, ఇంట్లోకి ఓ అందమైన అమ్మాయి(రెబ జాన్)వస్తుంది. రావడమే ఖర్చులతో మోత మోగిస్తుంది. ఆమెకు బాలు తండ్రి(నరేష్) తోడవ్వడంతో డబ్బులు మంచి నీళ్లలా ఖర్చయిపోతూ ఉంటాయి. ఇది కాకుండా పరిచయమైన ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకునే అలవాటున్న బాలు హీరోయిన్ కు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చాడనేది తెరమీద చూడాలి
ట్రైలర్ కట్ ఫన్నీగా ఉంది. బరువైన ఎమోషన్లు, హెవీ ఫైట్లు లేకుండా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రామ్ అబ్బరాజు తీసుకున్న పాయింట్ డిఫరెంట్ గానే అనిపిస్తోంది. మూడు రోజుల ముందే ప్రీమియర్లు కూడా ప్లాన్ చేసుకున్న సామజవరగమనకు ఈ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం, రామ్ రెడ్డి ఛాయాగ్రహణం, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సమకూర్చిన ఈ కామెడీ మూవీ సక్సెస్ కావడం శ్రీవిష్ణుకి చాలా కీలకం. అందుకే ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నాడు. 29న స్పైతో తెలుగులో పోటీ పడాల్సి ఉంటుంది
This post was last modified on June 26, 2023 7:03 am
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…