వెరైటీ కథలు, ప్రయోగాలతో పాటు ప్రేక్షకుల మెప్పులు పొందుతాడని పేరున్న శ్రీవిష్ణు కొత్త సినిమా సామజవరగమన ఈ శుక్రవారమే థియేటర్లలో అడుగు పెట్టనుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ ట్రైలర్ ని ఇవాళ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. టీమ్ ప్రత్యేకంగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నిజానికీ మూవీ మొన్న నెలే రావాల్సి ఉన్నా పోటీ తదితర కారణాల వల్ల కాస్త లేట్ అయ్యింది. ఇంతకీ ట్రైలర్ లో కంటెంట్ ఆసక్తి పెంచేలా ఉందా .
మల్టీప్లెక్సులో పనిచేసే బాక్సాఫీస్ బాలు(శ్రీవిష్ణు) మధ్యతరగతి జీవి. కుటుంబ సభ్యులు సినిమాకు వచ్చినా సరే కనీసం పాప్ కార్న్ టబ్బు కొనాలన్నా నో అనే రకం. మహా పిసినారి. అలాంటి వాడి లైఫ్ లోకి, ఇంట్లోకి ఓ అందమైన అమ్మాయి(రెబ జాన్)వస్తుంది. రావడమే ఖర్చులతో మోత మోగిస్తుంది. ఆమెకు బాలు తండ్రి(నరేష్) తోడవ్వడంతో డబ్బులు మంచి నీళ్లలా ఖర్చయిపోతూ ఉంటాయి. ఇది కాకుండా పరిచయమైన ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకునే అలవాటున్న బాలు హీరోయిన్ కు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇచ్చాడనేది తెరమీద చూడాలి
ట్రైలర్ కట్ ఫన్నీగా ఉంది. బరువైన ఎమోషన్లు, హెవీ ఫైట్లు లేకుండా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రామ్ అబ్బరాజు తీసుకున్న పాయింట్ డిఫరెంట్ గానే అనిపిస్తోంది. మూడు రోజుల ముందే ప్రీమియర్లు కూడా ప్లాన్ చేసుకున్న సామజవరగమనకు ఈ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం, రామ్ రెడ్డి ఛాయాగ్రహణం, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సమకూర్చిన ఈ కామెడీ మూవీ సక్సెస్ కావడం శ్రీవిష్ణుకి చాలా కీలకం. అందుకే ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నాడు. 29న స్పైతో తెలుగులో పోటీ పడాల్సి ఉంటుంది
This post was last modified on June 26, 2023 7:03 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…