విడుదల ముందు రోజు కొత్త సినిమాలకు ప్రీమియర్లు వేయడం గత రెండేళ్లలో సాధారణం అయిపోయింది. అయితే మూడు రోజులు ముందుగా స్పెషల్ షోలు వేయడం మాత్రం అరుదు. శ్రీవిష్ణు కొత్త మూవీ సామజవరగమన ఈ నెల 29 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎంపిక చేసిన కొన్ని ప్రధాన కేంద్రాల్లో సోమవారం సాయంత్రమే స్క్రీనింగ్స్ వేయబోతున్నారు. అది కూడా ఒక్క షో మాత్రమే. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కడప, తిరుపతిలో ఒకేసారి 7.30 గంటలకు ప్రీమియర్లు మొదలవుతాయి.
తెలంగాణకు సంబంధించి ఇంకా థియేటర్ల లిస్టు రావాల్సి ఉంది. సమర్పకులు అనిల్ సుంకర తన భోళా శంకర్ హీరో చిరంజీవితో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఎంటర్ టైనర్ గా రూపొందిన సామజవరగమనకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎర్లీ ప్రీమియర్లు వేయడం చూస్తే కంటెంట్ మీద నమ్మకం గట్టిగానే కనిపిస్తోంది. 29నే నిఖిల్ స్పైని ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాని పోటీని తట్టుకోవాలంటే సామజవరగమన ప్రమోషన్ స్పీడ్ తో పాటు ఇలాంటి ఎత్తుగడలు వేయాల్సిందే. అందుకే ఈ రూటు పట్టారు .
గతంలో మేజర్, 777 ఛార్లీ, మేం ఫేమస్, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే ఫలితం దక్కింది. అందుకే సామజవరగమనకు మంచి ఛాన్స్ దక్కింది. రాజరాజచోర తర్వాత మూడు ఫ్లాపులతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు బాక్సాఫీస్ వద్ద గ్యాప్ ని వాడుకోవాలి. స్పై బాగున్నా సరే రెండో ఆప్షన్ గా ఆడియన్స్ దీనివైపే చూస్తారు. ఎలాగూ ఆదిపురుష్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. తిరిగి జూలై 7 దాకా స్పేస్ దక్కుతుంది. అప్పుడూ భారీ చిత్రలేం లేవు. కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈజీగా నిలదొక్కుకోవచ్చు. చూడాలి మరి
This post was last modified on June 25, 2023 9:33 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…