విడుదల ముందు రోజు కొత్త సినిమాలకు ప్రీమియర్లు వేయడం గత రెండేళ్లలో సాధారణం అయిపోయింది. అయితే మూడు రోజులు ముందుగా స్పెషల్ షోలు వేయడం మాత్రం అరుదు. శ్రీవిష్ణు కొత్త మూవీ సామజవరగమన ఈ నెల 29 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎంపిక చేసిన కొన్ని ప్రధాన కేంద్రాల్లో సోమవారం సాయంత్రమే స్క్రీనింగ్స్ వేయబోతున్నారు. అది కూడా ఒక్క షో మాత్రమే. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కడప, తిరుపతిలో ఒకేసారి 7.30 గంటలకు ప్రీమియర్లు మొదలవుతాయి.
తెలంగాణకు సంబంధించి ఇంకా థియేటర్ల లిస్టు రావాల్సి ఉంది. సమర్పకులు అనిల్ సుంకర తన భోళా శంకర్ హీరో చిరంజీవితో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఎంటర్ టైనర్ గా రూపొందిన సామజవరగమనకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎర్లీ ప్రీమియర్లు వేయడం చూస్తే కంటెంట్ మీద నమ్మకం గట్టిగానే కనిపిస్తోంది. 29నే నిఖిల్ స్పైని ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాని పోటీని తట్టుకోవాలంటే సామజవరగమన ప్రమోషన్ స్పీడ్ తో పాటు ఇలాంటి ఎత్తుగడలు వేయాల్సిందే. అందుకే ఈ రూటు పట్టారు .
గతంలో మేజర్, 777 ఛార్లీ, మేం ఫేమస్, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే ఫలితం దక్కింది. అందుకే సామజవరగమనకు మంచి ఛాన్స్ దక్కింది. రాజరాజచోర తర్వాత మూడు ఫ్లాపులతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు బాక్సాఫీస్ వద్ద గ్యాప్ ని వాడుకోవాలి. స్పై బాగున్నా సరే రెండో ఆప్షన్ గా ఆడియన్స్ దీనివైపే చూస్తారు. ఎలాగూ ఆదిపురుష్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. తిరిగి జూలై 7 దాకా స్పేస్ దక్కుతుంది. అప్పుడూ భారీ చిత్రలేం లేవు. కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈజీగా నిలదొక్కుకోవచ్చు. చూడాలి మరి
This post was last modified on June 25, 2023 9:33 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…