విడుదల ముందు రోజు కొత్త సినిమాలకు ప్రీమియర్లు వేయడం గత రెండేళ్లలో సాధారణం అయిపోయింది. అయితే మూడు రోజులు ముందుగా స్పెషల్ షోలు వేయడం మాత్రం అరుదు. శ్రీవిష్ణు కొత్త మూవీ సామజవరగమన ఈ నెల 29 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎంపిక చేసిన కొన్ని ప్రధాన కేంద్రాల్లో సోమవారం సాయంత్రమే స్క్రీనింగ్స్ వేయబోతున్నారు. అది కూడా ఒక్క షో మాత్రమే. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కడప, తిరుపతిలో ఒకేసారి 7.30 గంటలకు ప్రీమియర్లు మొదలవుతాయి.
తెలంగాణకు సంబంధించి ఇంకా థియేటర్ల లిస్టు రావాల్సి ఉంది. సమర్పకులు అనిల్ సుంకర తన భోళా శంకర్ హీరో చిరంజీవితో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఎంటర్ టైనర్ గా రూపొందిన సామజవరగమనకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎర్లీ ప్రీమియర్లు వేయడం చూస్తే కంటెంట్ మీద నమ్మకం గట్టిగానే కనిపిస్తోంది. 29నే నిఖిల్ స్పైని ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాని పోటీని తట్టుకోవాలంటే సామజవరగమన ప్రమోషన్ స్పీడ్ తో పాటు ఇలాంటి ఎత్తుగడలు వేయాల్సిందే. అందుకే ఈ రూటు పట్టారు .
గతంలో మేజర్, 777 ఛార్లీ, మేం ఫేమస్, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే ఫలితం దక్కింది. అందుకే సామజవరగమనకు మంచి ఛాన్స్ దక్కింది. రాజరాజచోర తర్వాత మూడు ఫ్లాపులతో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు బాక్సాఫీస్ వద్ద గ్యాప్ ని వాడుకోవాలి. స్పై బాగున్నా సరే రెండో ఆప్షన్ గా ఆడియన్స్ దీనివైపే చూస్తారు. ఎలాగూ ఆదిపురుష్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. తిరిగి జూలై 7 దాకా స్పేస్ దక్కుతుంది. అప్పుడూ భారీ చిత్రలేం లేవు. కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈజీగా నిలదొక్కుకోవచ్చు. చూడాలి మరి
This post was last modified on June 25, 2023 9:33 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…