Movie News

సూర్య స్నేహం ఎంత గొప్పదంటే

కొందరు స్టార్ హీరోలకు ఎలాంటి భేషజాలు ఉండవు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే వాళ్ళుంటారు. ఎవరో చెబితే కానీ బయట ప్రపంచానికి తెలియదు. అందులో సూర్య ఒకరు. జై భీమ్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జ్ఞానవేల్ ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్న జ్ఞాపకాలు ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈయన సినిమాల్లోకి రావడానికి ముందు పిహెచ్డి పూర్తి చేసి ఆనంద వికటన్ పత్రికకు జర్నలిస్టు నుంచి బ్యూరో చీఫ్ వరకు ఎదిగాడు. ఎడిటర్ గా ప్రమోషన్ వస్తున్న టైంలో ఆ వృత్తి నుంచి సెలవు తీసుకుని సినిమాల వైపు మళ్లాడు.

వృత్తిలో భాగంగా ఎందరో హీరోలు, నటులతో జ్ఞానవేల్ కు మంచి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. స్నేహితులతో కలిసి అనాధ పిల్లల కోసం ఓ ఎన్జిఓ ఫౌండేషన్ పెట్టి వాళ్ళ చదువుకు సహాయం చేసేవాడు. ఫ్రెండ్స్ లో ఒకరైన సూర్యకు ఇది తెలిసి ఎంత వద్దంటున్నా 2 లక్షల రూపాయల విరాళం అందించాడు. అయితే ఇది అందరికీ చేరాలనే ఉద్దేశంతో అగరం ఫౌండేషన్ స్థాపించి ఆ బాధ్యతను జ్ఞానవేల్ కు అప్పగించాడు. దర్శకుడిగా తొలి సినిమా ఫ్లాప్ అయినా జై భీమ్ కథ వినగానే తానే హీరోగా నటించి నిర్మిస్తానని ముందుకొచ్చి పూర్తి చేశారు. ప్రైమ్ లో వచ్చాక అది సృష్టించిన చరిత్ర తెలిసిందే.

ఒకవేళ సూర్య కనక స్నేహితుడి ప్రతిభను గుర్థించి ఉండకపోతే జ్ఞానవేల్ ప్రయాణం ఇక్కడి దాకా వచ్చేదే కాదు. ఆస్కార్ రేంజ్ లో సినిమా తీశారని ప్రశంసలు దక్కేవి కాదు. ఇపుడా స్నేహమే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆయన 170 సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తెచ్చింది. అంతే కాదు 34 సంవత్సరాల తర్వాత రజని అమితాబ్ బచ్చన్ కలయికను సాధ్యం చేసింది. ఇంతకన్నా ఒక ఫిలిం మేకర్ కు కావాల్సిన అదృష్టం ఏముంటుంది. జై భీమ్ సూర్య చేయకపోతే ఇంకో హీరో నటించేవాడేమో. కానీ ఇంత రీచ్, సక్సెస్ వచ్చేది కాదనేది ముమ్మాటికీ సత్యం 

This post was last modified on June 25, 2023 1:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ ఫ్యాన్స్ నకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

2 minutes ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

9 minutes ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

4 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

6 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

7 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

9 hours ago