కొందరు స్టార్ హీరోలకు ఎలాంటి భేషజాలు ఉండవు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే వాళ్ళుంటారు. ఎవరో చెబితే కానీ బయట ప్రపంచానికి తెలియదు. అందులో సూర్య ఒకరు. జై భీమ్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జ్ఞానవేల్ ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్న జ్ఞాపకాలు ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈయన సినిమాల్లోకి రావడానికి ముందు పిహెచ్డి పూర్తి చేసి ఆనంద వికటన్ పత్రికకు జర్నలిస్టు నుంచి బ్యూరో చీఫ్ వరకు ఎదిగాడు. ఎడిటర్ గా ప్రమోషన్ వస్తున్న టైంలో ఆ వృత్తి నుంచి సెలవు తీసుకుని సినిమాల వైపు మళ్లాడు.
వృత్తిలో భాగంగా ఎందరో హీరోలు, నటులతో జ్ఞానవేల్ కు మంచి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. స్నేహితులతో కలిసి అనాధ పిల్లల కోసం ఓ ఎన్జిఓ ఫౌండేషన్ పెట్టి వాళ్ళ చదువుకు సహాయం చేసేవాడు. ఫ్రెండ్స్ లో ఒకరైన సూర్యకు ఇది తెలిసి ఎంత వద్దంటున్నా 2 లక్షల రూపాయల విరాళం అందించాడు. అయితే ఇది అందరికీ చేరాలనే ఉద్దేశంతో అగరం ఫౌండేషన్ స్థాపించి ఆ బాధ్యతను జ్ఞానవేల్ కు అప్పగించాడు. దర్శకుడిగా తొలి సినిమా ఫ్లాప్ అయినా జై భీమ్ కథ వినగానే తానే హీరోగా నటించి నిర్మిస్తానని ముందుకొచ్చి పూర్తి చేశారు. ప్రైమ్ లో వచ్చాక అది సృష్టించిన చరిత్ర తెలిసిందే.
ఒకవేళ సూర్య కనక స్నేహితుడి ప్రతిభను గుర్థించి ఉండకపోతే జ్ఞానవేల్ ప్రయాణం ఇక్కడి దాకా వచ్చేదే కాదు. ఆస్కార్ రేంజ్ లో సినిమా తీశారని ప్రశంసలు దక్కేవి కాదు. ఇపుడా స్నేహమే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆయన 170 సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తెచ్చింది. అంతే కాదు 34 సంవత్సరాల తర్వాత రజని అమితాబ్ బచ్చన్ కలయికను సాధ్యం చేసింది. ఇంతకన్నా ఒక ఫిలిం మేకర్ కు కావాల్సిన అదృష్టం ఏముంటుంది. జై భీమ్ సూర్య చేయకపోతే ఇంకో హీరో నటించేవాడేమో. కానీ ఇంత రీచ్, సక్సెస్ వచ్చేది కాదనేది ముమ్మాటికీ సత్యం
This post was last modified on June 25, 2023 1:13 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…