నిన్న విడుదలైనవన్నీ చిన్న సినిమాలే కావడంతో ఓపెనింగ్స్ మీద ట్రేడ్ పెద్దగా ఆశలేం పెట్టుకోలేదు. ఏదైనా పబ్లిక్ టాక్ వల్ల మెల్లగా పికప్ అవుతాయనే నమ్మకంతో ఎదురు చూశారు. అందులో భీమదేవరపల్లి బ్రాంచి ఒకటి. బేవార్స్ తో దర్శకుడిగా మారిన రమేష్ చెప్పాల దీన్ని రూపొందించారు. బలగం తర్వాత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోందని గుర్తించిన నిర్మాతలు తక్కువ బడ్జెట్ లో తీసినవాటిని రిస్క్ అయినా సరే థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆ మధ్య పరేషాన్, ఇంటింటి రామాయణం కూడా ఇదే కోవలో వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక కథ విషయానికి వస్తే భీమదేవరపల్లి గ్రామంలో చావులకు డప్పులు కొట్టే జంపన్న(అంజి)కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకులో జన్ ధన్ ఖాతా తెరుస్తాడు. ఓ రోజు తల్లి అకౌంట్ లో 15 లక్షలు పడటంతో అది ప్రభుత్వమే ఇచ్చిందని భావించి విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలుపెడతాడు. దాంట్లో కొంత పెట్టుబడిగా తీసుకుని కొన్న పెట్రోల్ బావి పీతి బావని తెలిసి మోసపోతాడు. తీరా డబ్బులైపోయే సమయానికి అవి పొరపాటుగా పడ్డ సొమ్ములని వెనక్కు ఇచ్చేయమని నోటీసు వస్తుంది. దీంతో హతాశుడైన జంపన్న ఈ గండం నుంచి బయట పడేందుకు ఏం చేశాడన్నది అసలు స్టోరీ
పూర్తిగా తెలంగాణ నేటివిటీ, బాష మీద ఆధారపడి తీసిన చిత్రమిది. ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా టైం పాస్ చేయించినా రెండో సగంలో దర్శకుడు రమేష్ చేతులెత్తేయడంతో కథనం నత్తనడక సాగి నవ్వించలేక, ఎమోషన్స్ పండించలేక ఫైనల్ గా అసంతృప్తి మిగిలిస్తుంది. పొరపాటుగా డబ్బులు పడటాన్ని మీడియా ఏదో జాతీయ సమస్యలా కవర్ చేసిందని చూపించడం అతిశయోక్తిగా ఉంది. ఒక పుకారు పల్లె ప్రజల అమాయకత్వం మీద ఎలాంటి ప్రభావం చూపిందనే పాయింట్ బాగున్నప్పటికీ కథనంలో బలం లేక తేలిపోయింది. ఇద్దరు ముగ్గురు తప్ప క్యాస్టింగ్ మిస్ ఫైర్ అయ్యింది. డ్రామాని నేటివిటీ డామినేట్ చేయడంతో బ్రాంచి పనితనం ఆకట్టుకోలేదు
This post was last modified on June 25, 2023 12:10 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…