మహేష్ బాబు కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. రాజమౌళితో చేయబోయే చిత్రం మరో ఎత్తు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. పుష్కరం కిందటే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కుదరలేదు. ఐతే ఈ ఆలస్యం కూడా మంచికే అయింది. ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించిన సమయంలో రాజమౌళితో సినిమా చేయబోతుండటం మహేష్ అదృష్టం అనే చెప్పాలి.
ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి కథ తయారీ పని నడుస్తోంది. ఎప్పట్లాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ ఫిలిం అని రాజమౌళి ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కథ గురించి మరికొన్ని విశేషాలు చెప్పారు. మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండియానా జోన్స్తో పాటు మరో చిత్రం ఛాయలు కూడా ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆ చిత్రమే.. 1981లో విడుదలైన రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్. ఇది కూడా అడ్వెంచరస్ ఫిలిమే. దీన్ని లెజెండరీ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ తీశాడు. ఇక తమ స్క్రిప్టు పనులు జులైకల్లా పూర్తవుతాయని వెల్లడించిన విజయేంద్ర.. ఈ చిత్రంలో థ్రిల్తో పాటు బోలెడంత ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కథను ముగించకుండా.. క్లైమాక్స్ను ఓపెన్గా వదిలేస్తున్నామని.. సీక్వెల్కు స్కోప్ ఉంటుందని విజయేంద్ర చెప్పడం విశేషం. దీన్ని బట్టి మహేష్, రాజమౌళి మళ్లీ కలిసి సినిమా చేయొచ్చన్నమాట. ఈ చిత్రానికి మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ప్రారంభోత్సవ వేడుక చేస్తారని అంటున్నారు. షూటింగ్ వచ్చే ఏడాదే మొదలయ్యే అవకాశముంది. స్క్రిప్టు లాక్ అయ్యాక ప్రి ప్రొడక్షన్ పనులకు ఆరు నెలలకు పైగానే సమయం పట్టొచ్చు.
This post was last modified on June 25, 2023 10:36 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…