మహేష్ బాబు కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. రాజమౌళితో చేయబోయే చిత్రం మరో ఎత్తు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. పుష్కరం కిందటే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కుదరలేదు. ఐతే ఈ ఆలస్యం కూడా మంచికే అయింది. ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగి.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించిన సమయంలో రాజమౌళితో సినిమా చేయబోతుండటం మహేష్ అదృష్టం అనే చెప్పాలి.
ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి కథ తయారీ పని నడుస్తోంది. ఎప్పట్లాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ ఫిలిం అని రాజమౌళి ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కథ గురించి మరికొన్ని విశేషాలు చెప్పారు. మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండియానా జోన్స్తో పాటు మరో చిత్రం ఛాయలు కూడా ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఆ చిత్రమే.. 1981లో విడుదలైన రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్. ఇది కూడా అడ్వెంచరస్ ఫిలిమే. దీన్ని లెజెండరీ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ తీశాడు. ఇక తమ స్క్రిప్టు పనులు జులైకల్లా పూర్తవుతాయని వెల్లడించిన విజయేంద్ర.. ఈ చిత్రంలో థ్రిల్తో పాటు బోలెడంత ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కథను ముగించకుండా.. క్లైమాక్స్ను ఓపెన్గా వదిలేస్తున్నామని.. సీక్వెల్కు స్కోప్ ఉంటుందని విజయేంద్ర చెప్పడం విశేషం. దీన్ని బట్టి మహేష్, రాజమౌళి మళ్లీ కలిసి సినిమా చేయొచ్చన్నమాట. ఈ చిత్రానికి మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ప్రారంభోత్సవ వేడుక చేస్తారని అంటున్నారు. షూటింగ్ వచ్చే ఏడాదే మొదలయ్యే అవకాశముంది. స్క్రిప్టు లాక్ అయ్యాక ప్రి ప్రొడక్షన్ పనులకు ఆరు నెలలకు పైగానే సమయం పట్టొచ్చు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…