ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకం సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. దానికి సినీ పరిశ్రమ మినహాయింపు కాదు. దీని బారిన పడిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ని ఊపేసిన కేసులో ఎందరో స్టార్లు డైరెక్టర్లు విచారణ పేరుతో గంటల తరబడి అధికారుల ఇన్వెస్టిగేషన్ ని ఎదురుకున్నారు. గత రెండు రోజులుగా మళ్ళీ ఈ ఇష్యూ చర్చలోకి వచ్చింది. కొందరు చిన్న ఆర్టిస్టులు ఈ స్కామ్ లో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మళ్ళీ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అయితే ఎవరూ దీని గురించి స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. తాజాగా నిఖిల్ డ్రగ్స్ మీద ఓపెనయ్యాడు.
హైదరాబాద్ లో నిర్వహించిన అవేర్ నెస్ (అవగాహన) సభలో మాట్లాడుతూ సంచలనాత్మకమైన విషయాలు చెప్పాడు. తనకూ మాదకద్రవ్యాలు ఆఫర్ చేశారని, అయితే వాటిని తిరస్కరించడం వల్లే హ్యాపీ డేస్ వచ్చాయని, నార్కొటిక్స్ కి నో చెప్పడం వల్లే కార్తికేయ లాంటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నానని పేర్కొన్నాడు. చిన్నపిల్లలు, టీనేజర్లు వాటి బారిన పడకుండా తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాళ్ళేం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని హితవు పలికాడు. జీవితాలు నాశనం చేసే ప్రమాదం వాటిలో ఉందని హెచ్చరిక చేశాడు.
నిఖిల్ తో పాటు ప్రియదర్శి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఎలాంటి అడ్డుతెర లేకుండా నిఖిల్ చేసిన కామెంట్స్ నిజంగా ఆలోచించాల్సిన సీరియస్ విషయాలే. విశాఖ నుంచి పంజాబ్ దాకా డ్రగ్స్ వల్ల విలువైన జీవితాలు, ప్రాణాలు కోల్పోయిన యువత లక్షల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో గంజాయి బారిన పడిన కాలేజీ కుర్రాళ్ళ సంఖ్యా వేలల్లో ఉంటోంది. వీటిని అరికట్టే బాధత్య పోలీసులు, ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరుడికి ఉందన్న నిఖిల్ తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక హీరో ఇంత బాహాటంగా డ్రగ్స్ గురించి చెప్పడం అరుదే
This post was last modified on June 24, 2023 11:55 pm
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…