ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకం సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. దానికి సినీ పరిశ్రమ మినహాయింపు కాదు. దీని బారిన పడిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ని ఊపేసిన కేసులో ఎందరో స్టార్లు డైరెక్టర్లు విచారణ పేరుతో గంటల తరబడి అధికారుల ఇన్వెస్టిగేషన్ ని ఎదురుకున్నారు. గత రెండు రోజులుగా మళ్ళీ ఈ ఇష్యూ చర్చలోకి వచ్చింది. కొందరు చిన్న ఆర్టిస్టులు ఈ స్కామ్ లో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మళ్ళీ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అయితే ఎవరూ దీని గురించి స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. తాజాగా నిఖిల్ డ్రగ్స్ మీద ఓపెనయ్యాడు.
హైదరాబాద్ లో నిర్వహించిన అవేర్ నెస్ (అవగాహన) సభలో మాట్లాడుతూ సంచలనాత్మకమైన విషయాలు చెప్పాడు. తనకూ మాదకద్రవ్యాలు ఆఫర్ చేశారని, అయితే వాటిని తిరస్కరించడం వల్లే హ్యాపీ డేస్ వచ్చాయని, నార్కొటిక్స్ కి నో చెప్పడం వల్లే కార్తికేయ లాంటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నానని పేర్కొన్నాడు. చిన్నపిల్లలు, టీనేజర్లు వాటి బారిన పడకుండా తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాళ్ళేం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని హితవు పలికాడు. జీవితాలు నాశనం చేసే ప్రమాదం వాటిలో ఉందని హెచ్చరిక చేశాడు.
నిఖిల్ తో పాటు ప్రియదర్శి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఎలాంటి అడ్డుతెర లేకుండా నిఖిల్ చేసిన కామెంట్స్ నిజంగా ఆలోచించాల్సిన సీరియస్ విషయాలే. విశాఖ నుంచి పంజాబ్ దాకా డ్రగ్స్ వల్ల విలువైన జీవితాలు, ప్రాణాలు కోల్పోయిన యువత లక్షల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో గంజాయి బారిన పడిన కాలేజీ కుర్రాళ్ళ సంఖ్యా వేలల్లో ఉంటోంది. వీటిని అరికట్టే బాధత్య పోలీసులు, ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరుడికి ఉందన్న నిఖిల్ తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక హీరో ఇంత బాహాటంగా డ్రగ్స్ గురించి చెప్పడం అరుదే
This post was last modified on June 24, 2023 11:55 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…