ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకం సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. దానికి సినీ పరిశ్రమ మినహాయింపు కాదు. దీని బారిన పడిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ని ఊపేసిన కేసులో ఎందరో స్టార్లు డైరెక్టర్లు విచారణ పేరుతో గంటల తరబడి అధికారుల ఇన్వెస్టిగేషన్ ని ఎదురుకున్నారు. గత రెండు రోజులుగా మళ్ళీ ఈ ఇష్యూ చర్చలోకి వచ్చింది. కొందరు చిన్న ఆర్టిస్టులు ఈ స్కామ్ లో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మళ్ళీ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అయితే ఎవరూ దీని గురించి స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. తాజాగా నిఖిల్ డ్రగ్స్ మీద ఓపెనయ్యాడు.
హైదరాబాద్ లో నిర్వహించిన అవేర్ నెస్ (అవగాహన) సభలో మాట్లాడుతూ సంచలనాత్మకమైన విషయాలు చెప్పాడు. తనకూ మాదకద్రవ్యాలు ఆఫర్ చేశారని, అయితే వాటిని తిరస్కరించడం వల్లే హ్యాపీ డేస్ వచ్చాయని, నార్కొటిక్స్ కి నో చెప్పడం వల్లే కార్తికేయ లాంటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నానని పేర్కొన్నాడు. చిన్నపిల్లలు, టీనేజర్లు వాటి బారిన పడకుండా తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాళ్ళేం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని హితవు పలికాడు. జీవితాలు నాశనం చేసే ప్రమాదం వాటిలో ఉందని హెచ్చరిక చేశాడు.
నిఖిల్ తో పాటు ప్రియదర్శి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఎలాంటి అడ్డుతెర లేకుండా నిఖిల్ చేసిన కామెంట్స్ నిజంగా ఆలోచించాల్సిన సీరియస్ విషయాలే. విశాఖ నుంచి పంజాబ్ దాకా డ్రగ్స్ వల్ల విలువైన జీవితాలు, ప్రాణాలు కోల్పోయిన యువత లక్షల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో గంజాయి బారిన పడిన కాలేజీ కుర్రాళ్ళ సంఖ్యా వేలల్లో ఉంటోంది. వీటిని అరికట్టే బాధత్య పోలీసులు, ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరుడికి ఉందన్న నిఖిల్ తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక హీరో ఇంత బాహాటంగా డ్రగ్స్ గురించి చెప్పడం అరుదే
This post was last modified on June 24, 2023 11:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…