ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకం సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. దానికి సినీ పరిశ్రమ మినహాయింపు కాదు. దీని బారిన పడిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ ని ఊపేసిన కేసులో ఎందరో స్టార్లు డైరెక్టర్లు విచారణ పేరుతో గంటల తరబడి అధికారుల ఇన్వెస్టిగేషన్ ని ఎదురుకున్నారు. గత రెండు రోజులుగా మళ్ళీ ఈ ఇష్యూ చర్చలోకి వచ్చింది. కొందరు చిన్న ఆర్టిస్టులు ఈ స్కామ్ లో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మళ్ళీ ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అయితే ఎవరూ దీని గురించి స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. తాజాగా నిఖిల్ డ్రగ్స్ మీద ఓపెనయ్యాడు.
హైదరాబాద్ లో నిర్వహించిన అవేర్ నెస్ (అవగాహన) సభలో మాట్లాడుతూ సంచలనాత్మకమైన విషయాలు చెప్పాడు. తనకూ మాదకద్రవ్యాలు ఆఫర్ చేశారని, అయితే వాటిని తిరస్కరించడం వల్లే హ్యాపీ డేస్ వచ్చాయని, నార్కొటిక్స్ కి నో చెప్పడం వల్లే కార్తికేయ లాంటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నానని పేర్కొన్నాడు. చిన్నపిల్లలు, టీనేజర్లు వాటి బారిన పడకుండా తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాళ్ళేం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని హితవు పలికాడు. జీవితాలు నాశనం చేసే ప్రమాదం వాటిలో ఉందని హెచ్చరిక చేశాడు.
నిఖిల్ తో పాటు ప్రియదర్శి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఎలాంటి అడ్డుతెర లేకుండా నిఖిల్ చేసిన కామెంట్స్ నిజంగా ఆలోచించాల్సిన సీరియస్ విషయాలే. విశాఖ నుంచి పంజాబ్ దాకా డ్రగ్స్ వల్ల విలువైన జీవితాలు, ప్రాణాలు కోల్పోయిన యువత లక్షల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో గంజాయి బారిన పడిన కాలేజీ కుర్రాళ్ళ సంఖ్యా వేలల్లో ఉంటోంది. వీటిని అరికట్టే బాధత్య పోలీసులు, ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరుడికి ఉందన్న నిఖిల్ తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక హీరో ఇంత బాహాటంగా డ్రగ్స్ గురించి చెప్పడం అరుదే
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…