మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ మీద భారీ అంచనాలేం లేని టైంలో అందరి కళ్ళు టీజర్ మీదే ఉన్నాయి. డైరెక్టర్ ట్రాక్ రికార్డుతో పాటు వేదాళం రీమేకనే విషయం షూటింగ్ టైం నుంచే నెగటివిటీని తెచ్చి పెట్టింది. వాటిని కొంచెమైనా బ్యాలన్స్ చేస్తుందనే నమ్మకంతో అభిమానులు ఈ వీడియో కోసం ఎదురు చూశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ తో తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన కేంద్రాల్లో ఈ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. మరి నిమిషంన్నర వీడియోలో రమేష్ అండ్ టీమ్ ఏం చెప్పిందంటే
కోల్కతా నగరంలో ముప్పై ఆరు మందిని ఒకేసారి చంపేస్తాడు భోళా శంకర్(చిరంజీవి). కానీ హత్యలు చేసింది అతననే విషయం తెలియని పోలీస్ డిపార్ట్ మెంట్ వేటను ముమ్మరం చేస్తుంది. చెల్లెలు(కీర్తి సురేష్), లాయర్ ప్రియురాలు(తమన్నా)తో హాయిగా గడిచిపోతున్న శంకర్ జీవితంలోకి పాత శత్రువు(తరుణ్ అరోరా)వస్తాడు. అక్కడి నుంచి కొత్త హింస కాండ మొదలవుతుంది. అసలు శంకర్ ఆ నగరానికి ఎందుకు వచ్చాడు, టాక్సీ డ్రైవర్ గా అవతారం ఎత్తి ఎందుకు మర్డర్ల దారి పట్టాడు లాంటి ప్రశ్నలకు సమాధానం ఇంకాస్త బెటర్ గా ట్రైలర్ వచ్చాక క్లారిటీ రావొచ్చు.
వాల్తేరు వీరయ్యలాగే ఇది కూడా టోటల్ మాస్ మెగాస్టార్ నే చూపించింది. ఒరిజినల్ వెర్షన్ కి పెద్దగా మార్పులు చేసినట్టు కనిపించలేదు. ఖైదీ నెంబర్ 150 విలన్ ని మళ్ళీ రిపీట్ చేశారు. కీర్తిసురేష్, తమన్నాలతో పాటు సుశాంత్ ని ఒక ఫ్రేమ్ లో రివీల్ చేశారు. రెగ్యులర్ ఫార్ములాతో సాగే ఈ కథలో చిరు ఫ్యాన్స్ ని ఉద్దేశించి హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్, షికారుకొచ్చిన షేర్ ని బె లాంటి డైలాగులు కమర్షియల్ మీటర్ లో ఉన్నాయి. మహతి స్వరసాగర్ బీజీఎమ్ మరీ గొప్పగా లేదు. ఉన్నంతలో సగటు చిరంజీవి సినిమా నుంచి ఆశించే హంగులు ఉంటాయనే హామీ మాత్రం ఈ టీజర్ తో భోళా శంకర్ ఇచ్చేశాడు
This post was last modified on June 24, 2023 6:47 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…