ఎంత పెద్ద డిజాస్టరైనా ఏదో ఒక రోజు చిన్నితెరకు రావాల్సిందే. ఒకప్పుడంటే శాటిలైట్ ఛానల్స్ మాత్రమే ఉండేవి కాబట్టి ఒకటి రెండు నెలలు ఆలస్యమైనా ఇబ్బంది లేదు. కానీ ఓటిటి జమానాలో అలా కుదరదు. బాక్సాఫీస్ వద్ద ఫెయిలయితే వీలైనంత త్వరగా డిజిటల్ వెర్షన్ వదిలేస్తే థియేటర్ మిస్ అయిన ఆడియన్స్ కనీసం ఫోన్ లో టీవీలో చూసుకునే అవకాశం దక్కుతుంది. దసరా, విరూపాక్ష, బలగం లాంటి బ్లాక్ బస్టర్లే నెల రోజుల ప్రీమియర్లు జరుపుకున్నప్పుడు ఏజెంట్ లాంటి సూపర్ ఫ్లాప్ ఎప్పుడో వచ్చి ఉండాలి. కానీ విచిత్రంగా వాయిదాలు పడుతూనే వస్తోంది.
వాస్తవానికి నిన్న ఎడిట్ చేసిన కొత్త వెర్షన్ తో ఏజెంట్ ఓటిటి రిలీజ్ ఉంటుందని కొద్దిరోజుల క్రితమే ప్రచారం జరిగింది. సరే వస్తుంది లెమ్మని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఏమైనా కొత్త సన్నివేశాలు లేదా ట్రిమ్ చేసిన వెర్షన్ బెటర్ గా ఉంటుందేమోనని వాళ్ళ నమ్మకం. కానీ రాలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి బృందం నిజంగానే రీ వర్క్ చేసిందా లేక ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనా అనే ప్రశ్నకు సమాధానం లేదు. నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్ టైన్మెంట్ బోళా శంకర్ ప్రమోషన్లలో బిజీ అయిపోయి ఏజెంట్ డిజిటల్ రిలీజ్ గురించి నామ మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు.
ఇంతకీ ఏజెంట్ వస్తుందా రాదా అనేది హక్కులు కొన్న సోనీ లివ్ అయినా చెబుతుందో లేదో మరి. ఇలాంటి పరాజయాలు ఏదో అఖిల్ ఒక్కడే చూసినట్టు ఆన్ లైన్ లో జరిగిన హంగామా దెబ్బకు ఇంత లేట్ అయ్యిందా లేక అసలు దీన్ని బయటికే తీసుకురాకుండా అలాగే సైడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారా సదరు బృందానికే తెలియాలి. అఖిల్ తర్వాతి సినిమా ఇంకా ప్రకటించలేదు. యువి, ధర్మా ప్రొడక్షన్ల కలిసి సంయుక్తంగా నిర్మించబోయే ఫాంటసీ మూవీతో కొత్త దర్శకుడు అనిల్ ని పరిచయం చేసే ప్రణాళిక ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇంకొద్ది రోజుల్లో ప్రకటన రావొచ్చు.
This post was last modified on June 24, 2023 2:24 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…