సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో తీవ్ర నిరాశకు గురయ్యారు ప్రభాస్ అభిమానులు. ‘ఆదిపురుష్’తో అయినా కథ మారుతుందని ఆశిస్తే మళ్లీ నిరాశ తప్పలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానిది ఆరంభ శూరత్వమే అయింది. దీంతో ఇక వాళ్ల ఆశలన్నీ ‘సలార్’ మీదికి మళ్లాయి. ఈ చిత్రం విడుదలకు ఇంకో మూడు నెలలే సమయం ఉంది. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాలేదు. అందుకు ముహూర్తం కుదిరిందన్నది చిత్ర వర్గాల సమాచారం.
ఇంకో రెండు వారాల్లో.. అంటే జులై 7న ‘సలార్’ టీజర్ రిలీజ్ కాబోతోందట. ప్రశాంత్ నీల్ మార్కుతో.. ప్రభాస్ను ఒక రేంజిలో చూపించేలా ఈ టీజర్ రూపొందినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. టీజర్తో మొదలుపెట్టి.. రిలీజ్ లోపు ప్రమోషన్లను కూడా ఒక రేంజిలో ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా ‘సలార్’ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రం ‘దళపతి’ తరహాలో ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే డ్రామా ఆధారంగా నడుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’తో కనెక్షన్ ఉంటుందని.. ప్రశాంత్ నీల్ మల్టీవర్స్ను ఈ సినిమాలో చూడబోతున్నామని చెబుతున్నారు. మరోవైపు ఇందులో కీలక పాత్ర చేస్తున్న తమిళ నటి శ్రియారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేకెత్తించేవే.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ఈ సినిమా సాగుతుందని.. ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేశాడని.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటుందని.. ప్రభాస్ పాత్ర, పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుందని ఆమె చెప్పడం అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్ పాత్రలు పోషిస్తుండగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…