పూజా హెగ్డే తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతోంది. అనుష్క, కాజల్, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ లాంటి ఒకప్పటి టాప్ హీరోయిన్ల ఊపు తగ్గాక.. పూజానే టాలీవుడ్లో హవా సాగిస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడమే కాక.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో టాలీవుడ్లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది.
పారితోషకం విషయంలో కూడా కొత్త శిఖరాలను అందుకుంది. స్టార్ హీరోయిన్ల కొరత అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇంకా కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో ఆమె హవా నడుస్తుందనే అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఆమె కెరీర్ తిరగబడిపోయింది. వరుస ఫ్లాపులు వస్తే ఎలాంటి హీరోయిన్కైనా కష్టమే అని.. అదే సమయంలో మెరుగైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తే సైడ్ అయిపోక తప్పదని పూజా విషయంలోనూ రుజువైంది.
పూజాకు వరుస ఫ్లాపులు వస్తున్న సమయంలోనే శ్రీలీల అనే కొత్తమ్మాయి రైజ్ అయింది. ‘పెళ్ళిసందడి’ లాంటి పేలవమైన సినిమా కూడా ఒక మాదిరిగా ఆడిందంటే అందుకు శ్రీలీల ఆకర్షణ ఓ ముఖ్య కారణం. ఇక రెండో సినిమా ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ కావడం.. అందం, అభినయం, డ్యాన్సింగ్ టాలెంట్.. ఇలా అన్నీ ఉండటంతో పెద్ద సినిమాల మేకర్స్ కళ్లు ఈ అమ్మాయిపై పడ్డాయి.
ఆల్రెడీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్తో నటిస్తోంది శ్రీలీల. నిజానికిది పూజా చేయాల్సిన సినిమానే. కానీ షూట్ ఆలస్యం అవుతుండటంతో పూజానే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాను ఎందుకు వదులుకున్నానా అని బాధ పడే పరిస్థితి. ‘ఉస్తాద్’లో పూజాను భర్తీ చేసిన శ్రీలీల.. ఇంకో సినిమాలోనూ ఆమెకు ఎసరు పెట్టిందంటున్నారు.
మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి రెండో హీరోయిన్గా ఎంపికైన శ్రీలీల.. ఇప్పుడు పూజా స్థానంలో లీడ్ హీరోయిన్ అయింది. ఇలా రెండు పెద్ద సినిమాల్లో పూజా స్థానాన్ని భర్తీ చేసిన శ్రీలీల.. ఇన్నాళ్లూ ఈ ముంబయి భామ చేతిలో ఉన్న నంబర్ వన్ కిరీటాన్ని కూడా లాగేసుకునేలా కనిపిస్తోంది. వరుస ఫ్లాపులు, చేజారుతున్న అవకాశాలతో టాలీవుడ్లో పూజా కెరీరే ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది.
This post was last modified on June 22, 2023 3:51 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…