పూజా హెగ్డే తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతోంది. అనుష్క, కాజల్, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ లాంటి ఒకప్పటి టాప్ హీరోయిన్ల ఊపు తగ్గాక.. పూజానే టాలీవుడ్లో హవా సాగిస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడమే కాక.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో టాలీవుడ్లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది.
పారితోషకం విషయంలో కూడా కొత్త శిఖరాలను అందుకుంది. స్టార్ హీరోయిన్ల కొరత అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇంకా కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో ఆమె హవా నడుస్తుందనే అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఆమె కెరీర్ తిరగబడిపోయింది. వరుస ఫ్లాపులు వస్తే ఎలాంటి హీరోయిన్కైనా కష్టమే అని.. అదే సమయంలో మెరుగైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తే సైడ్ అయిపోక తప్పదని పూజా విషయంలోనూ రుజువైంది.
పూజాకు వరుస ఫ్లాపులు వస్తున్న సమయంలోనే శ్రీలీల అనే కొత్తమ్మాయి రైజ్ అయింది. ‘పెళ్ళిసందడి’ లాంటి పేలవమైన సినిమా కూడా ఒక మాదిరిగా ఆడిందంటే అందుకు శ్రీలీల ఆకర్షణ ఓ ముఖ్య కారణం. ఇక రెండో సినిమా ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ కావడం.. అందం, అభినయం, డ్యాన్సింగ్ టాలెంట్.. ఇలా అన్నీ ఉండటంతో పెద్ద సినిమాల మేకర్స్ కళ్లు ఈ అమ్మాయిపై పడ్డాయి.
ఆల్రెడీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్తో నటిస్తోంది శ్రీలీల. నిజానికిది పూజా చేయాల్సిన సినిమానే. కానీ షూట్ ఆలస్యం అవుతుండటంతో పూజానే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాను ఎందుకు వదులుకున్నానా అని బాధ పడే పరిస్థితి. ‘ఉస్తాద్’లో పూజాను భర్తీ చేసిన శ్రీలీల.. ఇంకో సినిమాలోనూ ఆమెకు ఎసరు పెట్టిందంటున్నారు.
మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి రెండో హీరోయిన్గా ఎంపికైన శ్రీలీల.. ఇప్పుడు పూజా స్థానంలో లీడ్ హీరోయిన్ అయింది. ఇలా రెండు పెద్ద సినిమాల్లో పూజా స్థానాన్ని భర్తీ చేసిన శ్రీలీల.. ఇన్నాళ్లూ ఈ ముంబయి భామ చేతిలో ఉన్న నంబర్ వన్ కిరీటాన్ని కూడా లాగేసుకునేలా కనిపిస్తోంది. వరుస ఫ్లాపులు, చేజారుతున్న అవకాశాలతో టాలీవుడ్లో పూజా కెరీరే ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది.
This post was last modified on June 22, 2023 3:51 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…