సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. మొన్నటి వరకూ ఈ సినిమా అప్ డేట్స్ కోసం షూటింగ్ షెడ్యూల్స్ న్యూస్ కోసం వెయిట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ కి రోజుకో అవుట్ న్యూస్ బాధ పెడుతుంది. ముందుగా సినిమా నుండి తమన్ అవుట్ అనే న్యూస్ బయటికొచ్చింది. ఆ తర్వాత మేకర్స్ అదేం లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్తూ షూటింగ్ డీటైల్స్ బయటికి వదిలారు.
తమన్ న్యూస్ అవ్వగానే సినిమా నుండి పూజ హెగ్డే అవుట్ అంటూ మరో న్యూస్ వచ్చింది. దీనిపై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ పూజా హెగ్డే సినిమాలో నటించడం లేదని ఇకపై షూటింగ్ లో పాల్గొనదని పక్కాగా తెలుస్తుంది. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే తో పాటు శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పూజ ప్లేస్ లో మరో హీరోయిన్ ని ఫైనల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్.
మహేష్ కి జోడీగా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లాను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఫరియా తర్వాత నిధి అగర్వాల్ వంటి హీరోయిన్స్ ను కూడా ఛాయిస్ గా పెట్టుకుంటున్నారని సమాచారం. త్వరలోనే పూజ సినిమాలో నటించడం లేదని చెప్తూ మేకర్స్ మరో హీరోయిన్ కి వెల్కం చెప్పే అవకాశం ఉంది.
This post was last modified on June 21, 2023 3:28 pm
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…