కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. థియేటర్స్ లో ఉండగానే ఓటీటీ రిలీజ్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ సినిమాను చూశారంటే బలగం గొప్పదనం తెలుస్తుంది. చాలా కాలం తర్వాత అందరూ కలిసి వీధుల్లో చూసిన సినిమాగా బలగం హాట్ టాపిక్ అయింది. రిలీజ్ నుండే మీడియా , సినీ ప్రముఖులు అంతా కలిసి సినిమాను మెచ్చుకుంటూ ప్రమోట్ చేశారు. రిలీజైన కొన్ని రోజులు మోస్తారు రన్ తో నడిచిన ఈ సినిమా వారం అయ్యాక జనాల్లోకి వెళ్ళింది. అక్కడి నుండి ఓటీటీ లోకి వచ్చే వరకూ థియేటర్స్ లో కుటుంబాలను భారీ రప్పించింది. విడిపోయిన కుటుంబాలను మళ్ళీ కలిపింది.
అయితే మొదటి సినిమానే ఇంత గొప్పగా తీసి అందరినీ ఎమోషనల్ కి గురి చేసిన వేణును అందరూ అభినందించారు. హీరోల నుండి దర్శకుల వరకూ అందరూ మెచ్చుకుంటూ సన్మానాలు చేశారు. కానీ ఇలాంటి విషయాల్లో ముందుండే హీరో నాని మాత్రం ఆలస్యంగా బలగం చూసి ట్వీట్ చేశాడు. నిజానికి ఏ చిన్న సినిమా బాగున్నా నాని నుండి అభినందనలతో ఓ ట్వీట్ ఉంటుంది. కానీ బలగం విషయంలో చాలా ఆలస్యం చేశాడు నాని. ఇంత ఆలస్యంగా చూశానని నమ్మలేకపోతున్నా, తెలుగు సినిమా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమాగా బలగం చెప్పవచ్చు అంటూ టీం ను అభినందించాడు.
నేచురల్ స్టార్ బలగం ఇంత లేట్ గా చూడటం , అందరూ చెప్పేశాక ఇప్పుడు ట్వీట్ చేయడంతో టూ లేట్ నాని అంటే నెటిజన్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నాడు. సినిమా ఆడుతున్నప్పుడు ఇలాంటి ట్వీట్స్ సినిమాకు హెల్ప్ అవుతాయి కానీ ఇంత లేట్ గా చెప్తే ఏం ప్రయోజనం. పైగా సినిమాను జనం మెచ్చేసుకొని గుండెల్లో పెట్టేసుకున్నారు. ఏదేమైనా నాని ఈసారి ఓ చిన్న సినిమాను అభినందించడంలో చాలా ఆలస్యం చేశాడు మరి.
This post was last modified on June 21, 2023 12:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…