Movie News

ఇంత లేటేంటి నాని?

కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. థియేటర్స్ లో ఉండగానే ఓటీటీ రిలీజ్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ సినిమాను చూశారంటే బలగం గొప్పదనం తెలుస్తుంది. చాలా కాలం తర్వాత అందరూ కలిసి వీధుల్లో చూసిన సినిమాగా బలగం హాట్ టాపిక్ అయింది. రిలీజ్ నుండే మీడియా , సినీ ప్రముఖులు అంతా కలిసి సినిమాను మెచ్చుకుంటూ ప్రమోట్ చేశారు. రిలీజైన కొన్ని రోజులు మోస్తారు రన్ తో నడిచిన ఈ సినిమా వారం అయ్యాక జనాల్లోకి వెళ్ళింది. అక్కడి నుండి ఓటీటీ లోకి వచ్చే వరకూ థియేటర్స్ లో కుటుంబాలను భారీ రప్పించింది. విడిపోయిన కుటుంబాలను మళ్ళీ కలిపింది. 

అయితే మొదటి సినిమానే ఇంత గొప్పగా తీసి అందరినీ ఎమోషనల్ కి గురి చేసిన వేణును అందరూ అభినందించారు. హీరోల నుండి దర్శకుల వరకూ అందరూ మెచ్చుకుంటూ సన్మానాలు చేశారు. కానీ ఇలాంటి విషయాల్లో ముందుండే హీరో నాని మాత్రం ఆలస్యంగా బలగం చూసి ట్వీట్ చేశాడు. నిజానికి ఏ చిన్న సినిమా బాగున్నా నాని నుండి అభినందనలతో ఓ ట్వీట్ ఉంటుంది. కానీ బలగం విషయంలో చాలా ఆలస్యం చేశాడు నాని. ఇంత ఆలస్యంగా చూశానని నమ్మలేకపోతున్నా, తెలుగు సినిమా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమాగా బలగం చెప్పవచ్చు అంటూ టీం ను అభినందించాడు. 

నేచురల్ స్టార్ బలగం ఇంత లేట్ గా చూడటం , అందరూ చెప్పేశాక ఇప్పుడు ట్వీట్ చేయడంతో టూ లేట్ నాని అంటే నెటిజన్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నాడు. సినిమా ఆడుతున్నప్పుడు ఇలాంటి ట్వీట్స్ సినిమాకు హెల్ప్ అవుతాయి కానీ ఇంత లేట్ గా చెప్తే ఏం ప్రయోజనం. పైగా సినిమాను జనం మెచ్చేసుకొని గుండెల్లో పెట్టేసుకున్నారు. ఏదేమైనా నాని ఈసారి ఓ చిన్న సినిమాను అభినందించడంలో చాలా ఆలస్యం చేశాడు మరి.

This post was last modified on June 21, 2023 12:24 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

3 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

6 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

6 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

7 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

8 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

8 hours ago