కమెడియన్ వేణు టిల్లు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. థియేటర్స్ లో ఉండగానే ఓటీటీ రిలీజ్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ సినిమాను చూశారంటే బలగం గొప్పదనం తెలుస్తుంది. చాలా కాలం తర్వాత అందరూ కలిసి వీధుల్లో చూసిన సినిమాగా బలగం హాట్ టాపిక్ అయింది. రిలీజ్ నుండే మీడియా , సినీ ప్రముఖులు అంతా కలిసి సినిమాను మెచ్చుకుంటూ ప్రమోట్ చేశారు. రిలీజైన కొన్ని రోజులు మోస్తారు రన్ తో నడిచిన ఈ సినిమా వారం అయ్యాక జనాల్లోకి వెళ్ళింది. అక్కడి నుండి ఓటీటీ లోకి వచ్చే వరకూ థియేటర్స్ లో కుటుంబాలను భారీ రప్పించింది. విడిపోయిన కుటుంబాలను మళ్ళీ కలిపింది.
అయితే మొదటి సినిమానే ఇంత గొప్పగా తీసి అందరినీ ఎమోషనల్ కి గురి చేసిన వేణును అందరూ అభినందించారు. హీరోల నుండి దర్శకుల వరకూ అందరూ మెచ్చుకుంటూ సన్మానాలు చేశారు. కానీ ఇలాంటి విషయాల్లో ముందుండే హీరో నాని మాత్రం ఆలస్యంగా బలగం చూసి ట్వీట్ చేశాడు. నిజానికి ఏ చిన్న సినిమా బాగున్నా నాని నుండి అభినందనలతో ఓ ట్వీట్ ఉంటుంది. కానీ బలగం విషయంలో చాలా ఆలస్యం చేశాడు నాని. ఇంత ఆలస్యంగా చూశానని నమ్మలేకపోతున్నా, తెలుగు సినిమా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమాగా బలగం చెప్పవచ్చు అంటూ టీం ను అభినందించాడు.
నేచురల్ స్టార్ బలగం ఇంత లేట్ గా చూడటం , అందరూ చెప్పేశాక ఇప్పుడు ట్వీట్ చేయడంతో టూ లేట్ నాని అంటే నెటిజన్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నాడు. సినిమా ఆడుతున్నప్పుడు ఇలాంటి ట్వీట్స్ సినిమాకు హెల్ప్ అవుతాయి కానీ ఇంత లేట్ గా చెప్తే ఏం ప్రయోజనం. పైగా సినిమాను జనం మెచ్చేసుకొని గుండెల్లో పెట్టేసుకున్నారు. ఏదేమైనా నాని ఈసారి ఓ చిన్న సినిమాను అభినందించడంలో చాలా ఆలస్యం చేశాడు మరి.
This post was last modified on June 21, 2023 12:24 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…