వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనా సోకినట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే వర్మ మాత్రం అదేం లేదంటున్నాడు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియాలో వార్తలొస్తే .. అదంతా అబద్ధం అంటూ తాను ఎంత ఫిట్గా ఉన్నది చూపిస్తూ డంబుల్స్ ఎత్తి బైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోను ఇటీవలే షేర్ చేశాడు వర్మ.. దీంతో వర్మ గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదని అంతా అనుకున్నారు.
కానీ వర్మ నిర్మాణంలో తెరకెక్కి మర్డర్ సినిమా విడుదల ఆపాలంటూ మిర్యాలగూడకు చెందిన అమృత వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత తరఫు న్యాయవాది నల్గొండ జిల్లా కోర్టుకు ఇచ్చిన వివరణ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు.
తన క్లయింట్ రామ్ గోపాల్ వర్మ కు కరొనా వచ్చిన నేపథ్యంలో కోర్టు నోటీసులకు జవాబు ఇవ్వలేకపోతున్నామని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెలకు 14 వాయిదా వేసింది కోర్టు.. వర్మకు కరోనా ఉందని ఆయన న్యాయవాది కోర్టుకు చెప్పారు అంటే.. ఇక అంతకంటే రుజువేం కావాలి. అయినా సరే వర్మ మాత్రం తనకు కరోనా లేదనే అంటున్నాడు. సదరు వార్తను ఫేక్ న్యూస్గా పేర్కొంటూ ఒక ట్వీట్ చేశాడు. తాను నిర్మించిన థ్రిల్లర్ సినిమా కథానాయిక అప్సరా రాణితో కలిసి తాను ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. ఐతే వర్మ తీరేంటో జనాలకు తెలిసిందే కాబట్టి ఆయనకు కరోనా ఉందనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారంతా.
This post was last modified on August 11, 2020 11:09 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…