‘ఆదిపురుష్’ సినిమాకు అసలే టైం బాగా లేదు. విపరీతమైన డివైడ్ టాక్తో మొదలైన ఈ చిత్రం.. వీకెండ్ వరకు బలంగానే నిలబడ్డా.. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర డల్లయిపోయింది. డివైడ్ టాక్ బాగా పని చేసి.. సినిమాకు వసూళ్లు పడిపోయాయి. మళ్లీ వీకెండ్ వస్తే తప్ప సినిమా పుంజుకునేలా లేదు. అసలే పరిస్థితి బాలేదంటే.. ఈ చిత్రానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ‘ఆదిపురుష్’ను నిషేధించాలంటూ సినిమా వాళ్లే డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. రామాయణ గాథను కించపరిచేలా ‘ఆదిపురుష్’ తీశారంటూ ఈ సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించాలని ఈ సంఘం డిమాండ్ చేసింది. ‘శ్రీరామ చంద్రుడిని మతాలతో సంబంధం లేకుండా అందరూ దేవుడిగా నమ్ముతారు. కొలుస్తారు. కానీ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడితో పాటు రావణుడిని వీడియో గేమ్ కార్టూన్ల మాదిరి చిత్రీకరించారు.
ఇందులోని డైలాగులు భారతీయులనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంటనే ఈ సినిమా మీద నిషేధం విధించేలా చర్యలు చేపట్టాలి. థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత అవమానకంగా తీసిన ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో నటించాల్సింది కాదు. రామాయణాన్ని, రాముడిని కించపరిచేలా ఈ సినిమా తీశారు. వెంటనే దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషిర్, నిర్మాతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి’’ అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
This post was last modified on June 20, 2023 4:02 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…