ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ మూడు రోజుల్లో మూడు వందల కోట్లు దాటేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. ‘ఆదిపురుష్’ కలెక్షన్స్ తో మేకర్స్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తొలి వీకెండ్ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 340 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తూ పోస్టర్ విడుదల చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన మూడు రోజుల వసూళ్లను , మహేష్ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తూ ప్రభాస్ అభిమానులను గిల్లడం మొదలుపెట్టారు.
నాలుగో రోజు సర్కారు వారి పాట మార్నింగ్ షో కలెక్షన్స్ , మ్యాట్నీ వసూళ్లు థియేటర్స్ , ఏరియా వైస్ బయటికి తీస్తూ పాన్ ఇండియా మూవీ కాకుండా డైరెక్ట్ తెలుగు తెలుగు సినిమాతో నాన్ రాజమౌళితో మహేష్ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టాడని పోస్టులు చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. దీంతో ‘ఆదిపురుష్’ దెబ్బకి సర్కారు వారి పాట ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.
ఏదేమైనా ఓ స్టార్ సినిమా వచ్చినప్పుడు, మరో స్టార్ ఫ్యాన్స్ ఇలా వార్ కి దిగడం , కలెక్షన్స్ తో ఒకరికొకరు గిల్లుకోవడం సహజమే. ఇదంతా తమ అభిమాన హీరో గొప్ప చెప్పుకోవడం కిందకి వస్తుంది. వారికి వీరు కౌంటర్ వేయడం , వాళ్ళు రీ కౌంటర్ ఇవ్వడం సర్వ సాధారణం. ఇలా కొన్ని గంటలు కలెక్షన్స్ తో ఫ్యాన్స్ కబడ్డీ ఆడుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు.
This post was last modified on June 20, 2023 6:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…