ఆదిపురుష్ మీద జరుగుతున్న రచ్చ, చర్చ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ రామాయణంలోని పాత్రనే ఆధారంగా చేసుకున్న హనుమాన్ మీద దృష్టి పెరగడం మొదలైంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ డ్రామా కూడా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఆధారపడి నిర్మాణం జరుపుకుంది. త్రీడి వెర్షన్ కూడా సిద్ధం చేయబోతున్నారు. అయితే ప్రభాస్ మూవీనే ఇన్ని విమర్శలకు గురైనప్పుడు తేజ లాంటి చిన్న హీరోతో ఒక తెలుగు ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన చిత్రాన్ని ట్రోలర్స్ వదిలిపెడతారానే సందేహం రావడం సహజం.
కానీ హనుమాన్ కి అలాంటి భయమేమీ లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా వర్తమానంలో నడిచే సూపర్ హీరో కథ. అంతర్భాగంలో హనుమాన్ పాత్ర ఒక స్ఫూర్తిగా ఉంటుందే తప్ప కథనం పూర్తిగా ఫాంటసీ టచ్ తో సాగుతుంది. భజరంగి గొప్పదనం వివరించేలా ఇప్పటి తరం తమ శక్తి సామర్ధ్యాలు తాము తెలుసుకునేలా ఏం చేయాలనే పాయింట్ తో రూపొందిస్తున్నారు. నిజానికి మే లేదా జూన్ లో రిలీజ్ ప్లాన్ చేయాలనుకున్నారు కానీ గ్రాఫిక్స్ తాలూకు పనులు పెండింగ్ లో ఉండటంతో పాటు ఆదిపురుష్ అయ్యాకే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆగడం ప్లస్ అవుతోంది
నిజానికి ఈ పరిణామాలూ మంచికే అనుకోవాలి. హనుమాన్ కనక మెప్పించేలా ఉంటే నార్త్ ఆడియన్స్ నెత్తిన బెట్టుకుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆదిపురుష్ ని ఒక్కసారైనా థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళ నిర్ణయమే మూడు వందల కోట్ల వసూళ్లను దాటించింది. అలాంటిది హనుమాన్ ఎలివేషన్ ని కొత్త జనరేషన్ కోసం ప్లాన్ చేసుకున్న ప్రశాంత్ వర్మని స్వాగతించకుండా ఉంటారా. బడ్జెట్ చాలా ఎక్కువ అయినప్పటికీ నిర్మాతలు మాత్రం అవుట్ ఫుట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ వచ్చాక లెక్కలు రేట్లు మారిపోతాయనే ధీమాలో ఉన్నారు. చూద్దాం
This post was last modified on June 19, 2023 8:18 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…