ఆదిపురుష్ మీద జరుగుతున్న రచ్చ, చర్చ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ రామాయణంలోని పాత్రనే ఆధారంగా చేసుకున్న హనుమాన్ మీద దృష్టి పెరగడం మొదలైంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ డ్రామా కూడా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఆధారపడి నిర్మాణం జరుపుకుంది. త్రీడి వెర్షన్ కూడా సిద్ధం చేయబోతున్నారు. అయితే ప్రభాస్ మూవీనే ఇన్ని విమర్శలకు గురైనప్పుడు తేజ లాంటి చిన్న హీరోతో ఒక తెలుగు ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన చిత్రాన్ని ట్రోలర్స్ వదిలిపెడతారానే సందేహం రావడం సహజం.
కానీ హనుమాన్ కి అలాంటి భయమేమీ లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా వర్తమానంలో నడిచే సూపర్ హీరో కథ. అంతర్భాగంలో హనుమాన్ పాత్ర ఒక స్ఫూర్తిగా ఉంటుందే తప్ప కథనం పూర్తిగా ఫాంటసీ టచ్ తో సాగుతుంది. భజరంగి గొప్పదనం వివరించేలా ఇప్పటి తరం తమ శక్తి సామర్ధ్యాలు తాము తెలుసుకునేలా ఏం చేయాలనే పాయింట్ తో రూపొందిస్తున్నారు. నిజానికి మే లేదా జూన్ లో రిలీజ్ ప్లాన్ చేయాలనుకున్నారు కానీ గ్రాఫిక్స్ తాలూకు పనులు పెండింగ్ లో ఉండటంతో పాటు ఆదిపురుష్ అయ్యాకే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆగడం ప్లస్ అవుతోంది
నిజానికి ఈ పరిణామాలూ మంచికే అనుకోవాలి. హనుమాన్ కనక మెప్పించేలా ఉంటే నార్త్ ఆడియన్స్ నెత్తిన బెట్టుకుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆదిపురుష్ ని ఒక్కసారైనా థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళ నిర్ణయమే మూడు వందల కోట్ల వసూళ్లను దాటించింది. అలాంటిది హనుమాన్ ఎలివేషన్ ని కొత్త జనరేషన్ కోసం ప్లాన్ చేసుకున్న ప్రశాంత్ వర్మని స్వాగతించకుండా ఉంటారా. బడ్జెట్ చాలా ఎక్కువ అయినప్పటికీ నిర్మాతలు మాత్రం అవుట్ ఫుట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ వచ్చాక లెక్కలు రేట్లు మారిపోతాయనే ధీమాలో ఉన్నారు. చూద్దాం
This post was last modified on June 19, 2023 8:18 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…