Movie News

జేడీ చక్రవర్తిపై విష ప్రయోగం

90వ దశకంలో హీరోగా ఒక వెలుగు వెలిగాడు జేడీ చక్రవర్తి. హీరో వేషాలు తగ్గిపోయాక అప్పుడప్పుడూ విలన్ వేషాలు వేస్తూ.. అలాగే డైరెక్షన్ కూడా చేస్తూ కొన్నేళ్లు లైమ్ లైట్లోనే ఉన్నాడతను. కానీ ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో అతను పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడూ యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో మెరుస్తున్న జేడీ.. తన మీద విషప్రయోగం జరిగిన సంచలన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఆ ప్రయోగం చేసింది ఎవరు.. ఎందుకు చేశారు అని చెప్పలేదు కానీ.. ఎనిమిది నెలల పాటు తన మీద విష ప్రయోగం జరిగినట్లు మాత్రం వెల్లడించాడు. దాని గురించి అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కానీ కొన్ని రోజుల కిందట నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైంది. దీంతో డాక్టర్లను కలిశా. కానీ ఎవ్వరూ నా సమస్య ఏంటో కనుక్కోలేకపోయారు. విదేశాల్లో కూడా చూపించినా కూడా ఫలితం లేకపోయింది. ఒక దశలో నా పరిస్థితి కష్టమే అని డాక్టర్లు చెప్పేశారు. ఆ టైంలో నా ఫ్రెండ్ చెప్పాడని నాగార్జున అనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన నన్ను టెస్ట్ చేసి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావని అడిగారు. నాకు అలాంటి అలవాటే లేదని చెప్పాను. నేను ఒకప్పుడు ఒక కషాయం తాగేవాడిని. ఆరోగ్యం కోసమని నాతో ఒక వ్యక్తి అది తాగించేవాడు.

ఒకసారి ఖాసిం అనే నిర్మాత ఆ కషాయం తాగుతానన్నాడు. అది తాగాక రెండు రోజులు తీవ్ర జ్వరం వచ్చింది. నాకా కషాయం ఇస్తున్న వ్యక్తికి విషయం చెబితే.. నీకోసం చేసిందాన్ని వేరే వాళ్లకు ఎందుకు ఇచ్చావు అని కోప్పడ్డాడు. మా మధ్య దాని మీద పెద్ద గొడవ జరిగింది. చివరికి ఆసుపత్రిలో తేలిందేంటంటే నాకు ఎనిమిది నెలల పాటు స్లో పాయిజన్ ఇచ్చారు. అందు వల్లే నాకు శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయి. దాన్ని వేరే వ్యక్తి తాగితే అతడికి మందు కొట్టే అలవాటు ఉండటం వల్ల తన శరీరం తట్టుకోలేకపోయింది’’ అని జేడీ వెల్లడించాడు.

This post was last modified on June 18, 2023 12:22 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

4 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

7 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

7 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

8 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

8 hours ago