టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ల కాంబినేషన్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంపై డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. మరోవైపు, రామాయణ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, మరికొందరైతే… ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక, సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ అభిమానులు…చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై సోషల్ మీడియాలో కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్లు వసూలు చేసిందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం విడుదలైన తర్వాత దర్శకుడు ఓం రౌత్ తొలిసారిగా స్పందించారు. ఆది పురుష్ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో హనుమంతుడి కోసం వదిలిపెట్టిన సీట్ల ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ మొదలుపెట్టిన ఓం రౌత్…దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని అన్నారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై మాత్రం ఆయన స్పందించకపోవడం విశేషం.
This post was last modified on June 18, 2023 12:16 am
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…