జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ క్రేజీ మల్టీ స్టారర్ కాంబినేషన్ లో రూపొందబోయే వార్ 2 లో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైనట్టుగా వచ్చిన వార్త బాగా తిరుగుతోంది. అయితే ఇద్దరు హీరోల్లో తను ఎవరి పక్కన జోడిగా ఆడిపాడుతుందనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో హృతిక్ కి భిన్నంగా తారక్ పాత్రకు కొన్ని నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఒకే మిషన్ మీద వ్యతిరేక దిశలో పని చేస్తున్న ఈ ఇద్దరూ ఆఖరికి దేశం కోసం ఒక్కటై చేతులు కలిపి దేశద్రోహుల అంతు చూడటమనే మెయిన్ పాయింట్ తో రూపొందిస్తారట.
దర్శకుడు అయాన్ ముఖర్జీ అతి త్వరలో స్క్రిప్ట్ ఫైనల్ చేసి నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ తో ఓకే చేయించుకున్నాక హీరోలను కలవబోతున్నాడు. అయితే కియారాని ఎవరి పక్కన పెట్టాలనేది ఇంకా డిసైడ్ చేయలేదని వినికిడి. స్క్రీన్ స్పేస్ పరంగా హృతిక్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి తనకే ఉండొచ్చని మరో న్యూస్. ప్రీ ఇంటర్వెల్ నుంచి వచ్చే జూనియర్ ఎంట్రీతో సినిమా టోనే మారిపోతుందని, కమర్షియల్ ఫార్ములాతో రెగ్యులర్ హీరోయిన్ ట్రాక్, డ్యూయెట్లు లాంటివి లేకుండా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని యూనిట్ వర్గాల సమాచారం.
సో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న తారక్ దాన్ని నవంబర్ లేదా అంతకన్నా ముందు అక్టోబర్ లోనే పూర్తి చేసేలా దర్శకుడు కొరటాల శివతో ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నాలుగు నెలలు కేటాయించి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా నిర్ణయించుకున్నారట. దానికి అనుగుణంగానే వార్ 2కి కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లోగా సలార్ రిలీజై ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి వెంటనే ఎన్టీఆర్ 32 మొదలుపెట్టేయొచ్చు. అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే వార్ 2 మీద హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది
This post was last modified on June 17, 2023 11:26 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…