జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ క్రేజీ మల్టీ స్టారర్ కాంబినేషన్ లో రూపొందబోయే వార్ 2 లో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైనట్టుగా వచ్చిన వార్త బాగా తిరుగుతోంది. అయితే ఇద్దరు హీరోల్లో తను ఎవరి పక్కన జోడిగా ఆడిపాడుతుందనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో హృతిక్ కి భిన్నంగా తారక్ పాత్రకు కొన్ని నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఒకే మిషన్ మీద వ్యతిరేక దిశలో పని చేస్తున్న ఈ ఇద్దరూ ఆఖరికి దేశం కోసం ఒక్కటై చేతులు కలిపి దేశద్రోహుల అంతు చూడటమనే మెయిన్ పాయింట్ తో రూపొందిస్తారట.
దర్శకుడు అయాన్ ముఖర్జీ అతి త్వరలో స్క్రిప్ట్ ఫైనల్ చేసి నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ తో ఓకే చేయించుకున్నాక హీరోలను కలవబోతున్నాడు. అయితే కియారాని ఎవరి పక్కన పెట్టాలనేది ఇంకా డిసైడ్ చేయలేదని వినికిడి. స్క్రీన్ స్పేస్ పరంగా హృతిక్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి తనకే ఉండొచ్చని మరో న్యూస్. ప్రీ ఇంటర్వెల్ నుంచి వచ్చే జూనియర్ ఎంట్రీతో సినిమా టోనే మారిపోతుందని, కమర్షియల్ ఫార్ములాతో రెగ్యులర్ హీరోయిన్ ట్రాక్, డ్యూయెట్లు లాంటివి లేకుండా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని యూనిట్ వర్గాల సమాచారం.
సో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న తారక్ దాన్ని నవంబర్ లేదా అంతకన్నా ముందు అక్టోబర్ లోనే పూర్తి చేసేలా దర్శకుడు కొరటాల శివతో ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నాలుగు నెలలు కేటాయించి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా నిర్ణయించుకున్నారట. దానికి అనుగుణంగానే వార్ 2కి కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లోగా సలార్ రిలీజై ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి వెంటనే ఎన్టీఆర్ 32 మొదలుపెట్టేయొచ్చు. అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే వార్ 2 మీద హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది
This post was last modified on June 17, 2023 11:26 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…