జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ క్రేజీ మల్టీ స్టారర్ కాంబినేషన్ లో రూపొందబోయే వార్ 2 లో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైనట్టుగా వచ్చిన వార్త బాగా తిరుగుతోంది. అయితే ఇద్దరు హీరోల్లో తను ఎవరి పక్కన జోడిగా ఆడిపాడుతుందనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో హృతిక్ కి భిన్నంగా తారక్ పాత్రకు కొన్ని నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఒకే మిషన్ మీద వ్యతిరేక దిశలో పని చేస్తున్న ఈ ఇద్దరూ ఆఖరికి దేశం కోసం ఒక్కటై చేతులు కలిపి దేశద్రోహుల అంతు చూడటమనే మెయిన్ పాయింట్ తో రూపొందిస్తారట.
దర్శకుడు అయాన్ ముఖర్జీ అతి త్వరలో స్క్రిప్ట్ ఫైనల్ చేసి నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ తో ఓకే చేయించుకున్నాక హీరోలను కలవబోతున్నాడు. అయితే కియారాని ఎవరి పక్కన పెట్టాలనేది ఇంకా డిసైడ్ చేయలేదని వినికిడి. స్క్రీన్ స్పేస్ పరంగా హృతిక్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి తనకే ఉండొచ్చని మరో న్యూస్. ప్రీ ఇంటర్వెల్ నుంచి వచ్చే జూనియర్ ఎంట్రీతో సినిమా టోనే మారిపోతుందని, కమర్షియల్ ఫార్ములాతో రెగ్యులర్ హీరోయిన్ ట్రాక్, డ్యూయెట్లు లాంటివి లేకుండా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని యూనిట్ వర్గాల సమాచారం.
సో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్న తారక్ దాన్ని నవంబర్ లేదా అంతకన్నా ముందు అక్టోబర్ లోనే పూర్తి చేసేలా దర్శకుడు కొరటాల శివతో ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నాలుగు నెలలు కేటాయించి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా నిర్ణయించుకున్నారట. దానికి అనుగుణంగానే వార్ 2కి కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లోగా సలార్ రిలీజై ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి వెంటనే ఎన్టీఆర్ 32 మొదలుపెట్టేయొచ్చు. అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే వార్ 2 మీద హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది
This post was last modified on June 17, 2023 11:26 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…