కరోనా ఎన్నో కోట్ల మంది జీవితాల్ని అతలాకుతలం చేసింది. వాళ్లు ఉపాధిని పోగొట్టింది. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఏ లోటూ లేకుండా బతికిన వాళ్లు కూడా ఇప్పుడు నెలల తరబడి ఆదాయం లేక తమ స్థాయికి తగని పనుల వైపు మళ్లుతున్నారు. కరోనా వల్ల కుదేలైన రంగాల్లో సినిమా ఫీల్డ్ కూడా ఒకటి.
అందులోని కార్మికులకు ఆరు నెలలుగా ఉపాధి లేదు. సినీ పరిశ్రమ నుంచి అందే సాయంతో కడుపు నిండినా మిగతా అవసరాల మాటేంటి? ఇలా ఎన్ని నెలలు ఆ సాయం మీదే ఆధారపడి బతకడం. పైగా అందరికీ కూడా సాయం అందకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆదాయం కోసం వేరే మార్గాల వైపు చూస్తున్నారు.
కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నా ఎంతో కొంత పెట్టుబడి కావాలి. అది అందించే వాళ్లు దేవుళ్లే ఇప్పుడు. బాలీవుడ్లో వంద మంది డ్యాన్సర్లకు ఇప్పుడు కత్రినా కైఫ్ దేవతలాగే కనిపిస్తోంది. కరోనా వల్ల విపత్కర పరిస్థితుల్లో ఉన్న వంద మంది డ్యాన్సర్లకు కత్రినా ఆర్థిక సాయం చేసింది. వాళ్లు కూరగాయల దుకాణాలు పెట్టుకోవడానికి డబ్బులిచ్చింది.
ఇంతకుముందు హృతిక్ రోషన్ సైతం ఇలా వంద మంది డ్యాన్సర్లకు సాయం చేశాడు. అతడి స్ఫూర్తితోనే కత్రినా కూడా తన వంతు సాయం ప్రకటించింది. ఈ డబ్బులు అందుకున్న డ్యాన్సర్లు కూరగాయలకు ఇప్పుడున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని చిన్న స్థాయిలో వ్యాపారం పెట్టుకున్నారు. దీంతో వారి కుటుంబాలకు తాత్కాలికంగా కష్టాలు తీరిపోయాయి. సినిమాల్లో మళ్లీ పనులు దొరికే వరకు ఇబ్బంది లేనట్లే.
This post was last modified on August 11, 2020 11:46 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…