అదేంటి విడ్డూరంగా విమానం సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం ఎందుకనుకుంటున్నారా. అసలు మతలబు వేరే ఉంది. రేపు విడుదల కాబోతున్న ఆదిపురుష్ కోసం హైదరాబాద్ లో ఉన్న థియేటర్లు తొంభై శాతంకు పైగా ప్రభాస్ మూవీకే ఇచ్చారు. అందులో అభిమానులు చాలా కీలకంగా భావించేవి ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సింగల్ స్క్రీన్లు. తెల్లవారుఝామున బెనిఫిట్ షోలతో సహా అక్కడ ఉన్నవన్నీ ఆదిపురుష్ వేసుకుంటున్నాయి. కానీ కీలకమైన సంధ్య 70 ఎంఎంలో మాత్రం విమానంనే కొనసాగించడం అసలు ట్విస్టు. టాక్ సంగతి ఎలా ఉన్నా కమర్షియల్ ఫెయిల్యూర్ ఇది
క్వాలిటీ స్క్రీన్, పెద్ద కెపాసిటీ ఉన్న సంధ్యలో విమానం కొనసాగించడం వల్ల క్రాస్ రోడ్స్ కు సంబంధించిన ఆదిపురుష్ ఓవరాల్ గ్రాస్ లో భారీ కోత పడుతుందని ఫీలవుతున్నారు. నిజానికి విమానంకు కనీస ఆక్యుపెన్సీ రావడం లేదు. షోకి అయిదు వేలు దాటడమే గగనమైపోయింది. అయినా సరే మొదటి వారం ఏదోలా నెట్టుకొచ్చారు. సెకండ్ వీక్ కంటిన్యూ చేసేంత సీన్ లేదు. అయినా ఆడిస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్ కు అడ్వాన్స్ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చి ఉంటాయి. లేదంటే ఇలా జరగదు. ఆదిపురుష్ పంపిణి చేస్తున్న మైత్రి గట్టిగానే ట్రై చేస్తోందట
నాలుగైదు షోలు వేస్తే సంధ్య 70 ఎంఎంలో పది లక్షలకు పైనే గ్రాస్ వస్తుంది. అలాంటిది మూడు నాలుగు వేలు తెచ్చే విమానంని ఆడించి లాభం లేదు. క్రాస్ రోడ్స్ లో ఆర్ఆర్ఆర్ రికార్డుల మీద కన్నేసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ పరిణామం మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా మైత్రిని, పీపుల్స్ మీడియాని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయముంది. ఇప్పటికిప్పుడు సంధ్యలో ఆదిపురుష్ వేస్తే నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ అవుతాయి. కనీసం ఆదివారం వరకు హౌస్ ఫుల్ బోర్డు తీయాల్సిన పని ఉండదు. కానీ విమానం కదిలించే సూచనలైతే తక్కువగా ఉన్నాయి
కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్…
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…