అదేంటి విడ్డూరంగా విమానం సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం ఎందుకనుకుంటున్నారా. అసలు మతలబు వేరే ఉంది. రేపు విడుదల కాబోతున్న ఆదిపురుష్ కోసం హైదరాబాద్ లో ఉన్న థియేటర్లు తొంభై శాతంకు పైగా ప్రభాస్ మూవీకే ఇచ్చారు. అందులో అభిమానులు చాలా కీలకంగా భావించేవి ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సింగల్ స్క్రీన్లు. తెల్లవారుఝామున బెనిఫిట్ షోలతో సహా అక్కడ ఉన్నవన్నీ ఆదిపురుష్ వేసుకుంటున్నాయి. కానీ కీలకమైన సంధ్య 70 ఎంఎంలో మాత్రం విమానంనే కొనసాగించడం అసలు ట్విస్టు. టాక్ సంగతి ఎలా ఉన్నా కమర్షియల్ ఫెయిల్యూర్ ఇది
క్వాలిటీ స్క్రీన్, పెద్ద కెపాసిటీ ఉన్న సంధ్యలో విమానం కొనసాగించడం వల్ల క్రాస్ రోడ్స్ కు సంబంధించిన ఆదిపురుష్ ఓవరాల్ గ్రాస్ లో భారీ కోత పడుతుందని ఫీలవుతున్నారు. నిజానికి విమానంకు కనీస ఆక్యుపెన్సీ రావడం లేదు. షోకి అయిదు వేలు దాటడమే గగనమైపోయింది. అయినా సరే మొదటి వారం ఏదోలా నెట్టుకొచ్చారు. సెకండ్ వీక్ కంటిన్యూ చేసేంత సీన్ లేదు. అయినా ఆడిస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్ కు అడ్వాన్స్ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చి ఉంటాయి. లేదంటే ఇలా జరగదు. ఆదిపురుష్ పంపిణి చేస్తున్న మైత్రి గట్టిగానే ట్రై చేస్తోందట
నాలుగైదు షోలు వేస్తే సంధ్య 70 ఎంఎంలో పది లక్షలకు పైనే గ్రాస్ వస్తుంది. అలాంటిది మూడు నాలుగు వేలు తెచ్చే విమానంని ఆడించి లాభం లేదు. క్రాస్ రోడ్స్ లో ఆర్ఆర్ఆర్ రికార్డుల మీద కన్నేసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ పరిణామం మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా మైత్రిని, పీపుల్స్ మీడియాని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయముంది. ఇప్పటికిప్పుడు సంధ్యలో ఆదిపురుష్ వేస్తే నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ అవుతాయి. కనీసం ఆదివారం వరకు హౌస్ ఫుల్ బోర్డు తీయాల్సిన పని ఉండదు. కానీ విమానం కదిలించే సూచనలైతే తక్కువగా ఉన్నాయి
This post was last modified on June 15, 2023 9:40 pm
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…