2024 సంక్రాంతికి ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉండగానే ఆ సీజన్లో వచ్చే సినిమాల మీద ఉత్కంఠ నెలకొంది. ఆ పండక్కి షెడ్యూల్ అయిన ‘ప్రాజెక్ట్-కే’ రేసు నుంచి తప్పుకున్నట్లు దాదాపుగా తేలిపోవడంతో మొత్తం లెక్కలు మారిపోతున్నాయి. దీనికి పోటీగా ఆల్రెడీ షెడ్యూల్ అయిన ‘గుంటూరు కారం’కి సంబంధించి చిత్రీకరణలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ.. ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ పండక్కే రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
కాగా తాజాగా మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘ఈగల్’ 2024 సంక్రాంతికి రిలీజ్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతానికి రెండు సినిమాలు మాత్రమే పండక్కి వస్తున్నట్లు. కానీ ఆ టైంలో ఇంకో పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి కూడా అవకాశముంటుందని భావిస్తున్నారు. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంతకుముందు అయితే పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో ఉంటాడనే ప్రచారం జరిగింది. ఆయన గత రెండు మూడు నెలలుగా మార్చి మార్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాల షూటింగ్లో పాల్గొంటూ వచ్చాడు. వీటిలో వీలును బట్టి ఏదో ఒక సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇటు ‘ఉస్తాద్..’ దర్శకుడు హరీష్ శంకర్, అటు ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య ఇద్దరూ కూడా వేర్వేరు సందర్భాల్లో తమ చిత్రాలను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
కానీ ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో తన సినిమాల షూటింగ్లన్నీ ఆపేసిన పవన్.. పూర్తిగా రాజకీయాలకు టైం కేటాయించాలని ఫిక్సయ్యాడు. దీంతో ఉస్తాద్, ఓజీ.. ఈ రెండింట్లో ఏదీ సంక్రాంతికి రాదని తేలిపోయింది. కాగా ఇప్పుడు చిరంజీవి సంక్రాంతి రేసులోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఆయన త్వరలోనే కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెడుతున్నారు. ఆ సినిమాను వేగంగా పూర్తి చేసి 2024 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. మరి వరుసగా రెండో ఏడాది సంక్రాంతికి చిరు హంగామా ఉంటుందేమో చూడాలి.
This post was last modified on June 15, 2023 4:16 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…