నిర్మాణ దశలోనే విపరీతమైన హైప్ మోసుకొస్తున్న ప్రాజెక్ట్ కెలో కమల్ హాసన్ భాగం కావడం ఫిక్సయ్యింది. టీమ్ అఫీషియల్ గా చెప్పకపోయినా లీకైన సోర్స్ నమ్మదగినది కావడంతో పది రోజుల క్రితమే ఈ న్యూస్ వైరల్ కావడం తెలిసిందే. ఆగస్ట్ లో మొదలయ్యే షెడ్యూల్ నుంచి ముప్పై రోజుల కాల్ షీట్స్ కోసం లోకనాయకుడికి అక్షరాలా వంద కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారని ఇన్ సైడ్ టాక్. నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన క్యారెక్టర్ కావడంతో ఆయన తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరని దర్శకుడు నాగ అశ్విన్ భావించడం వల్లే ఇంత రెమ్యునరేషన్ కి సిద్ధపడ్డారట.
దీని వెనుక తెలివైన ఎత్తుగడ ఉంది. బాహుబలి తప్ప తమిళనాడులో అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన తెలుగు డబ్బింగులు తక్కువ. ఆర్ఆర్ఆర్ ఆడింది కానీ నెంబర్ వన్ కాలేకపోయింది. ప్రాజెక్ట్ కెలో ఇప్పుడు కమల్ తోడయ్యారు కాబట్టి ఆ బ్రాండ్ మీద నాలుగింతలు ఎక్కువ బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దాని వల్ల ఇప్పుడిస్తున్న పెద్ద మొత్తం వైజయంతి సంస్థకు ఈజీగా రికవర్ అయిపోతుంది. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అనుపమ్ ఖేర్ లు ఉన్నారు కాబట్టి నార్త్ మార్కెట్, థియేటర్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.
వీటన్నింటికి ప్రభాస్ మాచో ఇమేజ్ ఎలాగూ తోడవుతుంది. 2024 జనవరి 12 విడుదల టార్గెట్ చేసుకున్న ప్రాజెక్ట్ కె ఆ తేదీకి రావడం పట్ల అనుమానాలైతే ఉన్నాయి. ఇంకా షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. పాటలు పూర్తి చేయాలి. ప్రమోషన్లకు ఒక రెండు నెలలు కావాలి. అందుకే డౌట్ ఉన్న మాట వాస్తవం. ఈ కారణంగానే రవితేజ ఈగల్ తో పాటు చిరంజీవి కళ్యాణ్ కృష కాంబోలో మొదలవ్వాల్సిన సినిమా కూడా సంక్రాంతే అంటున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా కమల్ ప్రభాస్ ల మెంటల్ మాస్ కాంబినేషన్ తెరమీద సృష్టించబోయే విధ్వంసం మాటలకందటం కష్టమే
This post was last modified on June 15, 2023 2:27 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…