Movie News

ఔను.. మేం 20 సినిమాలు చేస్తున్నాం

ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌజ్ అయినా.. వాళ్లకు ఎంత బలమైన టీం ఉన్నా.. చేతిలో ఎంత డబ్బున్నా.. ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు చేయడమే కష్టం. అలాంటిది ఒక సంస్థ 20-30 సినిమాల దాకా ప్లాన్ చేస్తున్నట్లు..  అవి వివిధ దశల్లో ఉన్నట్లు వార్తలు రావడం టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. పీపుల్స్ మీడియా సంస్థ ఇలా ఒకేసారి బోలెడన్ని సినిమాలు ప్లాన్ చేస్తోందన్న సమాచారం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

ఈ ప్రచారంపై పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వ ప్రసాద్ మీడియాతో మాట్లాడాడు. తమ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్న ‘ఆదిపురుష్’ గురించి ఆయన మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తమ సంస్థ జోరు గురించి ఆయన మాట్లాడాడు. తమ సంస్థలో బోలెడన్ని సినిమాలు తెరకెక్కుతున్న విషయం వాస్తవమే అని ఆయన అంగీకరించాడు.

ఐతే ఒకేసారి 30 సినిమాలు తీసేంత సీన్ లేదని.. దాదాపు 20 సినిమాల దాకా వివిధ దశల్లో ఉన్నట్లు ఆయన ధ్రువీకరించాడు. ఐదు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయని.. 15 సినిమాలు స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్.. ఇలా వివిధ దశల్లో ఉన్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు. తాము చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే ప్రయాణం మొదలుపెట్టామని.. తమ సంస్థలో 25 సినిమాలు తీయడానికి ఐదేళ్లు పట్టిందని.. కానీ  తర్వాతి 25 సినిమాలు ఒకట్రెండేళ్లలో పూర్తి చేసి 50 చిత్రాల మైలురాయిని అందుకుంటామని విశ్వప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఆదిపురుష్’ సినిమా మీద తమకు ముందు నుంచి బలమైన నమ్మకం ఉందని, అది బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందనే ధీమాతోనే భారీ మొత్తానికి హక్కులు కొన్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించిన టీసిరీస్ సంస్థలో తెరకెక్కే తర్వాతి చిత్రాలను తామే తెలుగులో రిలీజ్ చేస్తామని ఆయనన్నారు. అంటే ‘యానిమల్’ను కూడా పీపుల్స్ మీడియా చేతుల మీదుగానే విడుదలవుతుందన్నమాట.

This post was last modified on June 14, 2023 11:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సారి నిప్పు రాజుకున్నాయి.…

2 hours ago

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

3 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

4 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

6 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

6 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

7 hours ago