పుష్ప ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాని రెండో భాగం పూర్తి చేసే వరకు కొత్త కమిట్ మెంట్లు ఇవ్వడం లేదు. తర్వాత చేయబోయే చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అన్న విషయం ముందే తెలిసిపోయినా దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. మరోవైపు ఆహా ఓటిటి బన్నీ, శ్రీలీల కాంబోతో మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ హంగామా చేస్తోంది. ఇది సినిమానా మరొకటానే విషయం స్పష్టంగా చెప్పలేదు. యాడ్ క్యాంపైన్ అని ఒకరు లేదు స్పెషల్ సాంగని మరొకరు అంటున్నారు.
ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది కానీ ఇది ముమ్మాటికీ సినిమా అయితే కాదు. ఎందుకంటే ఎంత తండ్రి నడిపే సంస్థ అయినా బన్నీ ఓటిటి మూవీ చేయడు. అది కూడా గుంటూరు కారంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్, శ్రీలీలను తీసుకొచ్చి. ఇదంతా పబ్లిసిటీ స్టెంటని ఫ్యాన్స్ అభిప్రాయం. ఏది ఏమైనా అదేదో క్లారిటి ఇచ్చేస్తే బాగుంటుంది. గతంలోనూ ప్రతి శుక్రవారం ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఉంటుందనే యాడ్ ని బన్నీతో చేయించుకున్న ఆహా ఆ మాట మీద నిలబడలేదు. మధ్యలో గ్యాప్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్త ప్రాజెక్టుతో ఏం చెప్పబోతున్నారో వేచి చూడాలి.
కానీ ఇలా అల్లు అర్జున్ ఆహా మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. పుష్ప అయ్యాక ఏం చేస్తాడనే ఉత్సుకత విపరీతంగా ఉన్న టైంలో ఇలా ఆహా మార్కెటింగ్ లో పాలు పంచుకోవడం గురించి ఎవరైనా చెప్పేదేముంటుంది. మార్కెట్ పరంగా ఆహా గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఇటీవలి కాలంలో సోనీ లివ్ దూకుడు పెంచింది. ఇంటర్నేషనల్ కంటెంట్ కే పరిమితమైన నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది చాలా తెలుగు సినిమాలు కొనేసుకుంది. ప్రైమ్ సంగతి సరేసరి. భారీ సంఖ్యలో వ్యూయర్స్ ని ఆకట్టుకోవాలంటే బలమైన ఎత్తుగడ కావాలి. అందుకే బన్నీ రంగంలోకి దిగాడు
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…