Movie News

సూర్య.. ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్

దక్షిణాది టాప్ స్టార్లలో, మేటి నటుల్లో సూర్య ఒకడు. అతడి ప్రతిభ గురించి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో అతను ప్రేక్షకులను కదిలించేశాడు. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియడ్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు కావడం విశేషం.

బిజినెస్ అంతకు రెట్టింపు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సూర్య నటించబోయే ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది ఒక బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ‘రంగ్ దె బసంతి’, ‘బాగ్ మిల్కా బాగ్’ చిత్రాలతో బాలీవుడ్ మేటి దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడట. ‘రక్త చరిత్ర-2’తో సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు.

ఇప్పుడు ‘కర్ణ’ పేరుతో రాకేశ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయడానికి సూర్య రెడీ అయ్యాడట. పేరును బట్టి ఇది కర్ణుడి కథే అని స్పష్టమవుతోంది. కర్ణుడి మీద సినిమా తీయాలని రాకేశ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఒక రకంగా ఇది అతడి డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. వందల కోట్ల బడ్జెట్లో రెండు భాగాలుగా ఈ సినిమా తీయడానికి రాకేశ్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.

వేరే నిర్మాణ సంస్థతో కలిసి స్వయంగా అతను ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. ‘కంగువ’ తర్వాత సూర్య.. ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అది తక్కువ టైంలోనే పూర్తయ్యే సినిమా. అది అయ్యాక రాకేశ్‌తో ‘కర్ణ’ చేస్తాడట. ఈ చిత్రం బేసిగ్గా హిందీలో తెరకెక్కినప్పటికీ.. ఆటోమేటిగ్గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదలవుతుంది. సూర్య లాంటి నటుడిని సరిగ్గా ఉపయోగించుకుని రాకేశ్ తన బెస్ట్ సినిమాలకు దీటుగా దీన్ని రూపొందిస్తే ఒక మైల్ స్టోన్ మూవీగా మారడం ఖాయం.

This post was last modified on June 13, 2023 4:15 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 mins ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

16 mins ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

1 hour ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

1 hour ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

3 hours ago