Movie News

సూర్య.. ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్

దక్షిణాది టాప్ స్టార్లలో, మేటి నటుల్లో సూర్య ఒకడు. అతడి ప్రతిభ గురించి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో అతను ప్రేక్షకులను కదిలించేశాడు. ప్రస్తుతం అతను శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియడ్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు కావడం విశేషం.

బిజినెస్ అంతకు రెట్టింపు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సూర్య నటించబోయే ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది ఒక బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ‘రంగ్ దె బసంతి’, ‘బాగ్ మిల్కా బాగ్’ చిత్రాలతో బాలీవుడ్ మేటి దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడట. ‘రక్త చరిత్ర-2’తో సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు.

ఇప్పుడు ‘కర్ణ’ పేరుతో రాకేశ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయడానికి సూర్య రెడీ అయ్యాడట. పేరును బట్టి ఇది కర్ణుడి కథే అని స్పష్టమవుతోంది. కర్ణుడి మీద సినిమా తీయాలని రాకేశ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఒక రకంగా ఇది అతడి డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. వందల కోట్ల బడ్జెట్లో రెండు భాగాలుగా ఈ సినిమా తీయడానికి రాకేశ్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.

వేరే నిర్మాణ సంస్థతో కలిసి స్వయంగా అతను ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. ‘కంగువ’ తర్వాత సూర్య.. ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అది తక్కువ టైంలోనే పూర్తయ్యే సినిమా. అది అయ్యాక రాకేశ్‌తో ‘కర్ణ’ చేస్తాడట. ఈ చిత్రం బేసిగ్గా హిందీలో తెరకెక్కినప్పటికీ.. ఆటోమేటిగ్గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదలవుతుంది. సూర్య లాంటి నటుడిని సరిగ్గా ఉపయోగించుకుని రాకేశ్ తన బెస్ట్ సినిమాలకు దీటుగా దీన్ని రూపొందిస్తే ఒక మైల్ స్టోన్ మూవీగా మారడం ఖాయం.

This post was last modified on June 13, 2023 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

17 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

57 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago