నెలలు వారాలు పోయి రోజుల కౌంట్ డౌన్ లోకి వచ్చేసిన ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే యాభై వేలకు పైగా మల్టీప్లెక్సుల టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ టాక్. ఏ క్షణంలో అయినా ఏపీ తెలంగాణ ఆన్ లైన్స్ మొదలవుతాయి. ప్రభాస్ అభిమానులతో పాటు సాగటు ప్రేక్షకులు వీలైనంత త్వరగా చూడాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. పఠాన్ ని టార్గెట్ చేసుకున్న ప్రభాస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈజీగా రికార్డులని లేపి అవతలేస్తాడు. ఇక సినిమాకు సంబంధించిన కీలక హైలైట్స్ అంతర్గత వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అవేంటో చూద్దాం. మొదటగా వాలి సుగ్రీవుల ఎపిసోడ్ ఊహించని విధంగా షాక్ ఇస్తుందట. దుష్టసంహారం కోసం ధర్మాన్ని పక్కన పెట్టడంలో తప్పు లేదనే రీతిలో చెప్పిన డైలాగులు, అక్కడ గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసే సన్నివేశం, రాఘవుడు-ఖరుడు మధ్య యుద్ధం, తోకతో హనుమంతుడు లంకా దహనం చేసే సీన్ త్రీడిలో చూస్తేనే ఆ అనుభూతి గొప్పగా ఉంటుందని ఊరిస్తున్నారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే రామ రావణ యుద్ధకాండ ఇండియన్ సినిమాలోనే బెస్ట్ క్లైమాక్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
సైఫ్అలీ ఖాన్ మీద ఉన్న నెగటివిటీ సినిమా చూశాక మొత్తం పోతుందట. సెన్సార్ సభ్యులు విభ్రాంతి చెందేలా దర్శకుడు ఓం రౌత్ మాయాజాలం చేశాడని అంటున్నారు. మొత్తానికి ఇవి వినగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. రామసేతు బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఓ రేంజ్ లో వచ్చిందని తెలిసింది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు లేక డ్రైగా ఉన్న పరిస్థితుల్లో థియేటర్లను హౌస్ ఫుల్ చేసి జనాలతో కిక్కిరిసిపోయేలా చేసేది ఒక్క ఆదిపురుష్ మాత్రమేనని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. ఎనభై శాతానికి పైగా త్రీడి ప్రింట్లే ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు
This post was last modified on June 13, 2023 10:41 am
దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ…
బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని…
కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే…
సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు…
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ…
ఏప్రిల్ 30 విడుదల కాబోతున్న పెద్ది బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం…