నెలలు వారాలు పోయి రోజుల కౌంట్ డౌన్ లోకి వచ్చేసిన ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే యాభై వేలకు పైగా మల్టీప్లెక్సుల టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ టాక్. ఏ క్షణంలో అయినా ఏపీ తెలంగాణ ఆన్ లైన్స్ మొదలవుతాయి. ప్రభాస్ అభిమానులతో పాటు సాగటు ప్రేక్షకులు వీలైనంత త్వరగా చూడాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. పఠాన్ ని టార్గెట్ చేసుకున్న ప్రభాస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈజీగా రికార్డులని లేపి అవతలేస్తాడు. ఇక సినిమాకు సంబంధించిన కీలక హైలైట్స్ అంతర్గత వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అవేంటో చూద్దాం. మొదటగా వాలి సుగ్రీవుల ఎపిసోడ్ ఊహించని విధంగా షాక్ ఇస్తుందట. దుష్టసంహారం కోసం ధర్మాన్ని పక్కన పెట్టడంలో తప్పు లేదనే రీతిలో చెప్పిన డైలాగులు, అక్కడ గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసే సన్నివేశం, రాఘవుడు-ఖరుడు మధ్య యుద్ధం, తోకతో హనుమంతుడు లంకా దహనం చేసే సీన్ త్రీడిలో చూస్తేనే ఆ అనుభూతి గొప్పగా ఉంటుందని ఊరిస్తున్నారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే రామ రావణ యుద్ధకాండ ఇండియన్ సినిమాలోనే బెస్ట్ క్లైమాక్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
సైఫ్అలీ ఖాన్ మీద ఉన్న నెగటివిటీ సినిమా చూశాక మొత్తం పోతుందట. సెన్సార్ సభ్యులు విభ్రాంతి చెందేలా దర్శకుడు ఓం రౌత్ మాయాజాలం చేశాడని అంటున్నారు. మొత్తానికి ఇవి వినగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. రామసేతు బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఓ రేంజ్ లో వచ్చిందని తెలిసింది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు లేక డ్రైగా ఉన్న పరిస్థితుల్లో థియేటర్లను హౌస్ ఫుల్ చేసి జనాలతో కిక్కిరిసిపోయేలా చేసేది ఒక్క ఆదిపురుష్ మాత్రమేనని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. ఎనభై శాతానికి పైగా త్రీడి ప్రింట్లే ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు
This post was last modified on June 13, 2023 10:41 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…