దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ ఒకరు. ఇప్పటిదాకా ఏ భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని రీతిలో ఆయన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. భారత్కు సంగీతంలో దక్కిన తొలి ఆస్కార్ అవార్డు అదే. ఇటీవల కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు గాను అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఇక రెహమాన్ సంగీత సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ లెజెండరీ డైరెక్టర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకు ఏఆర్ అమీన్, కూతురు ఏఆర్ ఖటీజా కూడా మ్యూజిక్లోకే అడుగు పెట్టారు. వీళ్లిద్దరూ చిన్నతనం నుంచే పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా ఖటీజా పెద్ద సంఖ్యలోనే పాటలు పాడి తన టాలెంట్ రుజువు చేసుకుంది. ఈ అమ్మాయి యుక్త వయసులోనే సంగీత దర్శకురాలిగా కూడా అరంగేట్రం చేసేస్తుండటం విశేషం.
‘మిన్మిని’ అనే తమిళ సినిమాతో ఖటీజా రెహమాన్ సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతోంది. తమిళంలో ‘సిల్లు కారుపట్టి’ అనే హిట్ మూవీతో దర్శకురాలిగా మారిన హాలిత షమీమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఖటీజా సంగీత దర్శకురాలిగా మారుతున్న విషయాన్ని హాలితనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఖటీజాతో కలిసి మ్యూజిక్ స్టూడియోలో పాటలు రికార్డు చేస్తున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
అసాధారణ ప్రతిభావంతురాలైన ఖటీజాతో కలిసి పని చేస్తుందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ మేటి సింగర్ ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారుతోందని.. గొప్ప మ్యూజిక్ వినబోతున్నారని ఆమె పేర్కొంది. ‘మిన్మిని’లో మలయాళ దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల కాబోతోంది. మరి తొలి చిత్రంతో ఖటీజా తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుందేమో చూడాలి.
This post was last modified on June 12, 2023 11:40 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…