దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ ఒకరు. ఇప్పటిదాకా ఏ భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని రీతిలో ఆయన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. భారత్కు సంగీతంలో దక్కిన తొలి ఆస్కార్ అవార్డు అదే. ఇటీవల కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు గాను అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఇక రెహమాన్ సంగీత సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ లెజెండరీ డైరెక్టర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకు ఏఆర్ అమీన్, కూతురు ఏఆర్ ఖటీజా కూడా మ్యూజిక్లోకే అడుగు పెట్టారు. వీళ్లిద్దరూ చిన్నతనం నుంచే పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా ఖటీజా పెద్ద సంఖ్యలోనే పాటలు పాడి తన టాలెంట్ రుజువు చేసుకుంది. ఈ అమ్మాయి యుక్త వయసులోనే సంగీత దర్శకురాలిగా కూడా అరంగేట్రం చేసేస్తుండటం విశేషం.
‘మిన్మిని’ అనే తమిళ సినిమాతో ఖటీజా రెహమాన్ సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతోంది. తమిళంలో ‘సిల్లు కారుపట్టి’ అనే హిట్ మూవీతో దర్శకురాలిగా మారిన హాలిత షమీమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఖటీజా సంగీత దర్శకురాలిగా మారుతున్న విషయాన్ని హాలితనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఖటీజాతో కలిసి మ్యూజిక్ స్టూడియోలో పాటలు రికార్డు చేస్తున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
అసాధారణ ప్రతిభావంతురాలైన ఖటీజాతో కలిసి పని చేస్తుందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ మేటి సింగర్ ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారుతోందని.. గొప్ప మ్యూజిక్ వినబోతున్నారని ఆమె పేర్కొంది. ‘మిన్మిని’లో మలయాళ దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల కాబోతోంది. మరి తొలి చిత్రంతో ఖటీజా తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుందేమో చూడాలి.
This post was last modified on June 12, 2023 11:40 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…