Movie News

రెహమాన్‌ కూతురు ఏం చేస్తోందో తెలుసా?

దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ ఒకరు. ఇప్పటిదాకా ఏ భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని రీతిలో ఆయన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. భారత్‌కు సంగీతంలో దక్కిన తొలి ఆస్కార్ అవార్డు అదే. ఇటీవల కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు గాను అకాడమీ అవార్డు అందుకున్నారు.

ఇక రెహమాన్ సంగీత సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ లెజెండరీ డైరెక్టర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకు ఏఆర్ అమీన్, కూతురు ఏఆర్ ఖటీజా కూడా మ్యూజిక్‌లోకే అడుగు పెట్టారు. వీళ్లిద్దరూ చిన్నతనం నుంచే పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా ఖటీజా పెద్ద సంఖ్యలోనే పాటలు పాడి తన టాలెంట్ రుజువు చేసుకుంది. ఈ అమ్మాయి యుక్త వయసులోనే సంగీత దర్శకురాలిగా కూడా అరంగేట్రం చేసేస్తుండటం విశేషం.

‘మిన్మిని’ అనే తమిళ సినిమాతో ఖటీజా రెహమాన్ సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతోంది. తమిళంలో ‘సిల్లు కారుపట్టి’ అనే హిట్ మూవీతో దర్శకురాలిగా మారిన హాలిత షమీమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఖటీజా సంగీత దర్శకురాలిగా మారుతున్న విషయాన్ని హాలితనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఖటీజాతో కలిసి మ్యూజిక్ స్టూడియోలో పాటలు రికార్డు చేస్తున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.

అసాధారణ ప్రతిభావంతురాలైన ఖటీజాతో కలిసి పని చేస్తుందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ మేటి సింగర్ ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారుతోందని.. గొప్ప మ్యూజిక్ వినబోతున్నారని ఆమె పేర్కొంది. ‘మిన్మిని’లో మలయాళ దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల కాబోతోంది. మరి తొలి చిత్రంతో ఖటీజా తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుందేమో చూడాలి.

Satya

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

8 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

40 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago