అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ ఆగస్ట్ 11 విడుదల కావడం కన్ఫర్మని యూనిట్ నుంచి సమాచారం వస్తున్నా ఇంకా అనుమానాలైతే తొలగిపోలేదు. పోటీగా ఉన్న గదర్ 2 మీద మెల్లగా బజ్ పెరుగుతున్నా, హఠాత్తుగా ఓ మై గాడ్ 2 పోటీలోకి వచ్చినా అవేవీ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా యానిమల్ ప్రీ లుక్ టీజర్ ఎలా ఉంటుందన్న ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉండింది. రన్బీర్ కపూర్ ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడన్న విషయం మీద క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టే నిమిషంలోపే ఉన్న చిన్న వీడియోని వదిలారు
ఖరీదయిన సూట్లు వేసుకున్న గుంపు ఒకటి మొహానికి ఐరన్ మాస్కులు వేసుకుని దాడికి రాబోతుండగా రన్బీర్ గోడ మీద అద్దాల అరలో నుంచి చిన్న గొడ్డలి తీసి వాళ్ళను ఊచకోత చేయడం మొదలుపెట్టడం నుంచి ప్రాణ భయంతో వాళ్ళందరూ పారిపోయే దాకా వెంటాడే క్రమాన్ని ఇందులో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో మంచి సాంప్రదాయ ఫాస్ట్ బీట్ పంజాబీ పాట వైరల్ అయ్యే రేంజ్ లో ఉంది. రన్బీర్ కపూర్ ని పూర్తిగా చూపించలేదు కానీ లీకైన స్టిల్స్ లో ఉన్నట్టే మాసిపోయిన గెడ్డంతో పాటు పంచెకట్టు లాంటి స్టైల్ లో సందీప్ వంగా ఏదో వెరైటీగా ట్రై చేయించాడు
గ్యాంగ్ స్టర్ డ్రామాతో యానిమల్ రూపొందినట్టు ఇప్పటికే టాక్ ఉంది. బాలీవుడ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతున్న స్టోరీ కూడా దాన్ని బలపరుస్తోంది. తండ్రిని చంపిన వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఒక ఫిజిక్స్ లెక్చరర్ హింసాత్మకంగా మారే క్రమాన్ని ఇందులో చూపిస్తారట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కబీర్ సింగ్ వల్ల సందీప్ వంగాకు నార్త్ లోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఆగస్ట్ 11న ఓ రేంజ్ లో అరాచకం చూపిస్తాడని ఫ్యాన్స్ బోలెడు నమ్మకంతో ఉన్నారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…