అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ ఆగస్ట్ 11 విడుదల కావడం కన్ఫర్మని యూనిట్ నుంచి సమాచారం వస్తున్నా ఇంకా అనుమానాలైతే తొలగిపోలేదు. పోటీగా ఉన్న గదర్ 2 మీద మెల్లగా బజ్ పెరుగుతున్నా, హఠాత్తుగా ఓ మై గాడ్ 2 పోటీలోకి వచ్చినా అవేవీ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా యానిమల్ ప్రీ లుక్ టీజర్ ఎలా ఉంటుందన్న ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉండింది. రన్బీర్ కపూర్ ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడన్న విషయం మీద క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టే నిమిషంలోపే ఉన్న చిన్న వీడియోని వదిలారు
ఖరీదయిన సూట్లు వేసుకున్న గుంపు ఒకటి మొహానికి ఐరన్ మాస్కులు వేసుకుని దాడికి రాబోతుండగా రన్బీర్ గోడ మీద అద్దాల అరలో నుంచి చిన్న గొడ్డలి తీసి వాళ్ళను ఊచకోత చేయడం మొదలుపెట్టడం నుంచి ప్రాణ భయంతో వాళ్ళందరూ పారిపోయే దాకా వెంటాడే క్రమాన్ని ఇందులో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో మంచి సాంప్రదాయ ఫాస్ట్ బీట్ పంజాబీ పాట వైరల్ అయ్యే రేంజ్ లో ఉంది. రన్బీర్ కపూర్ ని పూర్తిగా చూపించలేదు కానీ లీకైన స్టిల్స్ లో ఉన్నట్టే మాసిపోయిన గెడ్డంతో పాటు పంచెకట్టు లాంటి స్టైల్ లో సందీప్ వంగా ఏదో వెరైటీగా ట్రై చేయించాడు
గ్యాంగ్ స్టర్ డ్రామాతో యానిమల్ రూపొందినట్టు ఇప్పటికే టాక్ ఉంది. బాలీవుడ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతున్న స్టోరీ కూడా దాన్ని బలపరుస్తోంది. తండ్రిని చంపిన వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఒక ఫిజిక్స్ లెక్చరర్ హింసాత్మకంగా మారే క్రమాన్ని ఇందులో చూపిస్తారట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కబీర్ సింగ్ వల్ల సందీప్ వంగాకు నార్త్ లోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఆగస్ట్ 11న ఓ రేంజ్ లో అరాచకం చూపిస్తాడని ఫ్యాన్స్ బోలెడు నమ్మకంతో ఉన్నారు.
This post was last modified on June 11, 2023 4:57 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…