కుర్ర హీరో నిఖిల్ స్పై ఈ నెల 29 విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ లో మార్పు ఉండొచ్చని ప్రచారం జరిగింది కానీ అదేమీ లేదని యూనిట్ వాటిని కొట్టిపారేసింది. అయితే చేతిలో పంతొమ్మిది రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇప్పటి నుంచి హడావిడి చేస్తే అన్ని రాష్ట్రాలకు రీచ్ అవుతుంది. అలా కాకుండా సైలెంట్ గా ఉండటం వల్ల లాభం లేదు. అయితే స్పై టీమ్ చాలా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని ఇన్ సైడ్ టాక్. దానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
మొదటిది ఆదిపురుష్. 16న రాబోతున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ కు ఎలాంటి స్పందన వస్తుందోనని దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ తో పాటు హిందుత్వ వాదులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు బద్దలు కావడం ఖాయమే. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం కనీసం రెండు మూడు వారాల పాటు ఊచకోత ఉంటుంది. ఆ ఊపులో స్పైని వారం గ్యాప్ తో దించడం పెద్ద రిస్క్ అవుతుంది. కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ సలహా మేరకు హిందీ వెర్షన్ కు థియేటర్ల కొరత వచ్చే రిస్క్ ని దృష్టిలో ఉంచుకుని ఆగాలని నిర్ణయించుకున్నారట.
ఒకవేళ ఇక్కడ చెప్పింది జరిగితే వాయిదా తప్పకపోవచ్చు. అయితే ఇప్పుడే కన్ఫర్మ్ గా చెప్పలేం. ఒకవేళ 29 ఫిక్స్ అనుకున్నా ఆదిపురుష్ మేనియాలో ఇంకే సినిమా గురించి చెప్పినా జనాల బుర్రలోకి ఎక్కదు. అందుకే 17 దాకా వేచి చూడటం బెటర్. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం మీద రూపొందిన స్పైని దర్శకుడిగా మారిన ఎడిటర్ గ్యారీ తెరకెక్కిస్తున్నారు. టీజర్ లో యాక్షన్ విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. తనకు మరో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని నిఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి పబ్లిసిటీ స్పీడ్ పెంచితేనే అభిమానులకు స్పై మీద ధీమా కలుగుతుంది
This post was last modified on June 11, 2023 8:33 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…