కుర్ర హీరో నిఖిల్ స్పై ఈ నెల 29 విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ లో మార్పు ఉండొచ్చని ప్రచారం జరిగింది కానీ అదేమీ లేదని యూనిట్ వాటిని కొట్టిపారేసింది. అయితే చేతిలో పంతొమ్మిది రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇప్పటి నుంచి హడావిడి చేస్తే అన్ని రాష్ట్రాలకు రీచ్ అవుతుంది. అలా కాకుండా సైలెంట్ గా ఉండటం వల్ల లాభం లేదు. అయితే స్పై టీమ్ చాలా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని ఇన్ సైడ్ టాక్. దానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
మొదటిది ఆదిపురుష్. 16న రాబోతున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ కు ఎలాంటి స్పందన వస్తుందోనని దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ తో పాటు హిందుత్వ వాదులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు బద్దలు కావడం ఖాయమే. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం కనీసం రెండు మూడు వారాల పాటు ఊచకోత ఉంటుంది. ఆ ఊపులో స్పైని వారం గ్యాప్ తో దించడం పెద్ద రిస్క్ అవుతుంది. కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ సలహా మేరకు హిందీ వెర్షన్ కు థియేటర్ల కొరత వచ్చే రిస్క్ ని దృష్టిలో ఉంచుకుని ఆగాలని నిర్ణయించుకున్నారట.
ఒకవేళ ఇక్కడ చెప్పింది జరిగితే వాయిదా తప్పకపోవచ్చు. అయితే ఇప్పుడే కన్ఫర్మ్ గా చెప్పలేం. ఒకవేళ 29 ఫిక్స్ అనుకున్నా ఆదిపురుష్ మేనియాలో ఇంకే సినిమా గురించి చెప్పినా జనాల బుర్రలోకి ఎక్కదు. అందుకే 17 దాకా వేచి చూడటం బెటర్. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం మీద రూపొందిన స్పైని దర్శకుడిగా మారిన ఎడిటర్ గ్యారీ తెరకెక్కిస్తున్నారు. టీజర్ లో యాక్షన్ విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. తనకు మరో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని నిఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి పబ్లిసిటీ స్పీడ్ పెంచితేనే అభిమానులకు స్పై మీద ధీమా కలుగుతుంది
This post was last modified on June 11, 2023 8:33 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…