ఫిలిం సెలబ్రెటీలు అప్పుడప్పుడూ సరదాగా వంట గదిలోకి వెళ్తుంటారు. తమకు నచ్చిన, వచ్చిన వంటకాలేవో చేస్తుంటారు. ఐతే మేల్ సెలబ్రెటీల్లో చాలామంది ఏదో మొక్కుబడిగా వంట చేసేవాళ్లే అయ్యుంటారు. ఒక పద్ధతి ప్రకారం రకరకాల వంటలు చేసే, మంచి రుచి తీసుకొచ్చే పాక శాస్త్ర ప్రావీణ్యం కొద్ది మందికే ఉంటుంది. ఆ అరుదైన జాబితాలో మెగాస్టార్ చిరంజీవిని కచ్చితంగా చేర్చేయొచ్చని ఆయన తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
చిరు మంచి వంటగాడని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఆయన కర్ణాటకలో ఓసారి షూటింగ్ కోసం వెళ్లి వెరైటీ దోసె నేర్చుకుని వచ్చి.. దాన్ని ఇంట్లో ట్రై చేయడం.. తన స్టైల్ కూడా జోడించి అందరినీ మెప్పించడం.. ఇది రుచి చూసిన ఓ హోటల్ యజమాని ‘చిరు దోసె’ పేరుతో తన హోటల్ మెనూలో చేర్చడం తెలిసిన సంగతే.
తాను ట్విట్టర్లోకి అరంగేట్రం చేసిన కొత్తలో చిరు తన మార్కు దోసెను చాలా చక్కగా తయారు చేసి అమ్మకు రుచి చూపిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు దాన్ని మించిన వీడియోతో చిరు తన ఫాలోవర్లను మురిపించాడు. చింత తొక్కుతో చిన్న చేపల వేపుడు చేసి పెట్టారాయన. ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా నోరూరడం.. చివరికొచ్చేసరికి కడుపు కూడా నిండిపోవడం ఖాయం.
చెయ్యి తిరిగిన చెఫ్ తరహాలో చిరు చక్కగా తన వంటకం గురించి వివరిస్తూ ఏ తడబాటూ లేకుండా చింత పులుపు చేపల వేపుడు చేసిన వైనం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఇది తన చిన్నపుడు తల్లి చేసి ఇచ్చిన వంటకం అట. దాన్ని చిరు ఇప్పుడు వండి తన తల్లికే పెట్టాడు. ఇంతకీ ఆమె తన వంటకం రుచి చూసి ఏమంటుందో ఏమో అని టెన్షన్ పడ్డారు. కానీ ఆమె తిని చాలా బావుందని అనడంతో చిరు ఉప్పొంగిపోయారు. తర్వాత తల్లి చేతితో తనూ ముద్దలు తిన్నారు. చాలా ముచ్చటగా అనిపిస్తున్న ఈ వీడియో ఇన్స్టంట్గా వైరల్ అయిపోయింది.
This post was last modified on August 10, 2020 3:13 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…