ఫిలిం సెలబ్రెటీలు అప్పుడప్పుడూ సరదాగా వంట గదిలోకి వెళ్తుంటారు. తమకు నచ్చిన, వచ్చిన వంటకాలేవో చేస్తుంటారు. ఐతే మేల్ సెలబ్రెటీల్లో చాలామంది ఏదో మొక్కుబడిగా వంట చేసేవాళ్లే అయ్యుంటారు. ఒక పద్ధతి ప్రకారం రకరకాల వంటలు చేసే, మంచి రుచి తీసుకొచ్చే పాక శాస్త్ర ప్రావీణ్యం కొద్ది మందికే ఉంటుంది. ఆ అరుదైన జాబితాలో మెగాస్టార్ చిరంజీవిని కచ్చితంగా చేర్చేయొచ్చని ఆయన తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
చిరు మంచి వంటగాడని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఆయన కర్ణాటకలో ఓసారి షూటింగ్ కోసం వెళ్లి వెరైటీ దోసె నేర్చుకుని వచ్చి.. దాన్ని ఇంట్లో ట్రై చేయడం.. తన స్టైల్ కూడా జోడించి అందరినీ మెప్పించడం.. ఇది రుచి చూసిన ఓ హోటల్ యజమాని ‘చిరు దోసె’ పేరుతో తన హోటల్ మెనూలో చేర్చడం తెలిసిన సంగతే.
తాను ట్విట్టర్లోకి అరంగేట్రం చేసిన కొత్తలో చిరు తన మార్కు దోసెను చాలా చక్కగా తయారు చేసి అమ్మకు రుచి చూపిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు దాన్ని మించిన వీడియోతో చిరు తన ఫాలోవర్లను మురిపించాడు. చింత తొక్కుతో చిన్న చేపల వేపుడు చేసి పెట్టారాయన. ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా నోరూరడం.. చివరికొచ్చేసరికి కడుపు కూడా నిండిపోవడం ఖాయం.
చెయ్యి తిరిగిన చెఫ్ తరహాలో చిరు చక్కగా తన వంటకం గురించి వివరిస్తూ ఏ తడబాటూ లేకుండా చింత పులుపు చేపల వేపుడు చేసిన వైనం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఇది తన చిన్నపుడు తల్లి చేసి ఇచ్చిన వంటకం అట. దాన్ని చిరు ఇప్పుడు వండి తన తల్లికే పెట్టాడు. ఇంతకీ ఆమె తన వంటకం రుచి చూసి ఏమంటుందో ఏమో అని టెన్షన్ పడ్డారు. కానీ ఆమె తిని చాలా బావుందని అనడంతో చిరు ఉప్పొంగిపోయారు. తర్వాత తల్లి చేతితో తనూ ముద్దలు తిన్నారు. చాలా ముచ్చటగా అనిపిస్తున్న ఈ వీడియో ఇన్స్టంట్గా వైరల్ అయిపోయింది.
This post was last modified on August 10, 2020 3:13 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…