Movie News

కడుపు నింపేసిన చిరు

ఫిలిం సెలబ్రెటీలు అప్పుడప్పుడూ సరదాగా వంట గదిలోకి వెళ్తుంటారు. తమకు నచ్చిన, వచ్చిన వంటకాలేవో చేస్తుంటారు. ఐతే మేల్ సెలబ్రెటీల్లో చాలామంది ఏదో మొక్కుబడిగా వంట చేసేవాళ్లే అయ్యుంటారు. ఒక పద్ధతి ప్రకారం రకరకాల వంటలు చేసే, మంచి రుచి తీసుకొచ్చే పాక శాస్త్ర ప్రావీణ్యం కొద్ది మందికే ఉంటుంది. ఆ అరుదైన జాబితాలో మెగాస్టార్ చిరంజీవిని కచ్చితంగా చేర్చేయొచ్చని ఆయన తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.

చిరు మంచి వంటగాడని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఆయన కర్ణాటకలో ఓసారి షూటింగ్ కోసం వెళ్లి వెరైటీ దోసె నేర్చుకుని వచ్చి.. దాన్ని ఇంట్లో ట్రై చేయడం.. తన స్టైల్ కూడా జోడించి అందరినీ మెప్పించడం.. ఇది రుచి చూసిన ఓ హోటల్ యజమాని ‘చిరు దోసె’ పేరుతో తన హోటల్ మెనూలో చేర్చడం తెలిసిన సంగతే.

తాను ట్విట్టర్లోకి అరంగేట్రం చేసిన కొత్తలో చిరు తన మార్కు దోసెను చాలా చక్కగా తయారు చేసి అమ్మకు రుచి చూపిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు దాన్ని మించిన వీడియోతో చిరు తన ఫాలోవర్లను మురిపించాడు. చింత తొక్కుతో చిన్న చేపల వేపుడు చేసి పెట్టారాయన. ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా నోరూరడం.. చివరికొచ్చేసరికి కడుపు కూడా నిండిపోవడం ఖాయం.

చెయ్యి తిరిగిన చెఫ్ తరహాలో చిరు చక్కగా తన వంటకం గురించి వివరిస్తూ ఏ తడబాటూ లేకుండా చింత పులుపు చేపల వేపుడు చేసిన వైనం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఇది తన చిన్నపుడు తల్లి చేసి ఇచ్చిన వంటకం అట. దాన్ని చిరు ఇప్పుడు వండి తన తల్లికే పెట్టాడు. ఇంతకీ ఆమె తన వంటకం రుచి చూసి ఏమంటుందో ఏమో అని టెన్షన్ పడ్డారు. కానీ ఆమె తిని చాలా బావుందని అనడంతో చిరు ఉప్పొంగిపోయారు. తర్వాత తల్లి చేతితో తనూ ముద్దలు తిన్నారు. చాలా ముచ్చటగా అనిపిస్తున్న ఈ వీడియో ఇన్‌స్టంట్‌గా వైరల్ అయిపోయింది.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

4 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

10 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

13 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

13 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

14 hours ago