ఫిలిం సెలబ్రెటీలు అప్పుడప్పుడూ సరదాగా వంట గదిలోకి వెళ్తుంటారు. తమకు నచ్చిన, వచ్చిన వంటకాలేవో చేస్తుంటారు. ఐతే మేల్ సెలబ్రెటీల్లో చాలామంది ఏదో మొక్కుబడిగా వంట చేసేవాళ్లే అయ్యుంటారు. ఒక పద్ధతి ప్రకారం రకరకాల వంటలు చేసే, మంచి రుచి తీసుకొచ్చే పాక శాస్త్ర ప్రావీణ్యం కొద్ది మందికే ఉంటుంది. ఆ అరుదైన జాబితాలో మెగాస్టార్ చిరంజీవిని కచ్చితంగా చేర్చేయొచ్చని ఆయన తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
చిరు మంచి వంటగాడని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఆయన కర్ణాటకలో ఓసారి షూటింగ్ కోసం వెళ్లి వెరైటీ దోసె నేర్చుకుని వచ్చి.. దాన్ని ఇంట్లో ట్రై చేయడం.. తన స్టైల్ కూడా జోడించి అందరినీ మెప్పించడం.. ఇది రుచి చూసిన ఓ హోటల్ యజమాని ‘చిరు దోసె’ పేరుతో తన హోటల్ మెనూలో చేర్చడం తెలిసిన సంగతే.
తాను ట్విట్టర్లోకి అరంగేట్రం చేసిన కొత్తలో చిరు తన మార్కు దోసెను చాలా చక్కగా తయారు చేసి అమ్మకు రుచి చూపిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు దాన్ని మించిన వీడియోతో చిరు తన ఫాలోవర్లను మురిపించాడు. చింత తొక్కుతో చిన్న చేపల వేపుడు చేసి పెట్టారాయన. ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా నోరూరడం.. చివరికొచ్చేసరికి కడుపు కూడా నిండిపోవడం ఖాయం.
చెయ్యి తిరిగిన చెఫ్ తరహాలో చిరు చక్కగా తన వంటకం గురించి వివరిస్తూ ఏ తడబాటూ లేకుండా చింత పులుపు చేపల వేపుడు చేసిన వైనం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఇది తన చిన్నపుడు తల్లి చేసి ఇచ్చిన వంటకం అట. దాన్ని చిరు ఇప్పుడు వండి తన తల్లికే పెట్టాడు. ఇంతకీ ఆమె తన వంటకం రుచి చూసి ఏమంటుందో ఏమో అని టెన్షన్ పడ్డారు. కానీ ఆమె తిని చాలా బావుందని అనడంతో చిరు ఉప్పొంగిపోయారు. తర్వాత తల్లి చేతితో తనూ ముద్దలు తిన్నారు. చాలా ముచ్చటగా అనిపిస్తున్న ఈ వీడియో ఇన్స్టంట్గా వైరల్ అయిపోయింది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…