ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్న సంగతి తెలిసిందే. సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశాక.. అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ఫైనల్ కాపీ రెడీ చేసే దిశగా అడుగులు వేసింది చిత్ర బృందం.
కానీ ఇంతలో ‘ఆదిపురుష్’ టీం ఊహించనిది జరిగింది. ప్రమోషన్లకు శ్రీకారం చుడుతూ రిలీజ్ చేసిన టీజర్ దారుణమైన రీతిలో ట్రోలింగ్కు గురైంది. ఐదొందల కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా ఎందుకూ కొరగాకుండా పోతుందేమో అన్న భయం కలిగింది ఒక దశలో. ఈ ట్రోలింగ్ను పట్టించుకోకుండా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఆ భయాలే నిజం అయ్యేవేమో. కానీ సినిమాను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకుని మంచి పని చేశారు.
అప్పుడున్న నెగెటివిటీకి తోడు.. సంక్రాంతికి గట్టి పోటీ మధ్య ‘ఆదిపురుష్’ను రిలీజ్ చేసి ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరిస్థితులు ఎదురయ్యేవే. తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా మీద ఆశలు ఉండేవి కాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా అప్పటి నెగెటివిటీని తట్టుకుని సినిమా నిలబడేదా అన్నది సందేహమే. సినిమాను వాయిదా వేసి గ్రాఫిక్స్, ఇతర విషయాల మీద మళ్లీ వర్క్ చేయడం.. ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాల వాళ్లను కలిసి సినిమా మీద నెగెటివిటీని తగ్గించడం.. పాటలతో పాటు కొత్త ట్రైలర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం సినిమాకు ప్లస్ అయ్యాయి.
మొత్తంగా ఇప్పుడు ‘ఆదిపురుష్’ మీద నెగెటివిటీ అంతా పోయింది. మంచి హైప్ కనిపిస్తోంది. దీనికి తోడు బాక్సాఫీస్ దగ్గర కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వేసవిలో సరైన సినిమాలు లేక ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. ఏమాత్రం పోటీ లేకుండా సోలోగా ఇండియన్ బాక్సాఫీస్ను ఏలడానికి ‘ఆదిపురుష్’కు అవకాశం వచ్చింది. కాబట్టి కారణం ఏదైనప్పటికీ సినిమాను వాయిదా వేయడం ‘ఆదిపురుష్’కు ప్లస్సే అయింది.
This post was last modified on June 9, 2023 6:49 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…