ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్న సంగతి తెలిసిందే. సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశాక.. అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ఫైనల్ కాపీ రెడీ చేసే దిశగా అడుగులు వేసింది చిత్ర బృందం.
కానీ ఇంతలో ‘ఆదిపురుష్’ టీం ఊహించనిది జరిగింది. ప్రమోషన్లకు శ్రీకారం చుడుతూ రిలీజ్ చేసిన టీజర్ దారుణమైన రీతిలో ట్రోలింగ్కు గురైంది. ఐదొందల కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా ఎందుకూ కొరగాకుండా పోతుందేమో అన్న భయం కలిగింది ఒక దశలో. ఈ ట్రోలింగ్ను పట్టించుకోకుండా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఆ భయాలే నిజం అయ్యేవేమో. కానీ సినిమాను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకుని మంచి పని చేశారు.
అప్పుడున్న నెగెటివిటీకి తోడు.. సంక్రాంతికి గట్టి పోటీ మధ్య ‘ఆదిపురుష్’ను రిలీజ్ చేసి ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరిస్థితులు ఎదురయ్యేవే. తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా మీద ఆశలు ఉండేవి కాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా అప్పటి నెగెటివిటీని తట్టుకుని సినిమా నిలబడేదా అన్నది సందేహమే. సినిమాను వాయిదా వేసి గ్రాఫిక్స్, ఇతర విషయాల మీద మళ్లీ వర్క్ చేయడం.. ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాల వాళ్లను కలిసి సినిమా మీద నెగెటివిటీని తగ్గించడం.. పాటలతో పాటు కొత్త ట్రైలర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం సినిమాకు ప్లస్ అయ్యాయి.
మొత్తంగా ఇప్పుడు ‘ఆదిపురుష్’ మీద నెగెటివిటీ అంతా పోయింది. మంచి హైప్ కనిపిస్తోంది. దీనికి తోడు బాక్సాఫీస్ దగ్గర కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వేసవిలో సరైన సినిమాలు లేక ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. ఏమాత్రం పోటీ లేకుండా సోలోగా ఇండియన్ బాక్సాఫీస్ను ఏలడానికి ‘ఆదిపురుష్’కు అవకాశం వచ్చింది. కాబట్టి కారణం ఏదైనప్పటికీ సినిమాను వాయిదా వేయడం ‘ఆదిపురుష్’కు ప్లస్సే అయింది.
This post was last modified on June 9, 2023 6:49 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…