యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయకు.. యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న గొడవ సంగతి తెలిసిందే. విజయ్ వైపు నుంచి అనసూయ మీద ఇప్పటిదాకా ఏ రియాక్షన్ లేదు కానీ.. ఆమె మాత్రం కొన్నేళ్ల నుంచి అతణ్ని టార్గెట్ చేస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ పలికిన ఒక బూతు మాట విషయంలో అప్పట్లో అనసూయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన అభిమానుల నుంచి వ్యతిరేకత మొదలైంది.
ఇటీవల విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘ఖుషి’ పోస్టర్లో తన పేరు ముందు ‘the’ అని పెట్టుకోవడాన్ని ఆమె తప్పుబట్టడంతో తన అభిమానులతో అనసూయకు మరోమారు గొడవ జరిగింది. ఐతే విజయ్ను మళ్లీ మళ్లీ అనసూయ టార్గెట్ చేయడాన్ని చాలామంది తప్పుబట్టిన నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో అతడితో తన సమస్య ఏంటో వివరించింది. అంతే కాక తనతో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నట్లు కూడా చెప్పింది.
‘‘విజయ్ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. మేమిద్దరం మంచి స్నేహితులమే. ఐతే ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అభ్యంతరకర పదాలను సెన్సార్ వాళ్లు మ్యూట్ చేస్తే.. విజయ్ ఆ సినిమా విడుదలైనపుడు థియేటర్లకు వెళ్లి అభిమానులతో ఆ పదాలు చెప్పించాడు. ఇది ఒక తల్లిగా నన్నెంతో బాధించింది. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని విజయ్కి చెప్పా. ఆ తర్వాత నాపై ఆన్ లైన్ ట్రోల్స్ మొదలయ్యాయి.
ధైర్యంగా ఆ బాధ నుంచి బయటికి వచ్చి విజయ్ ప్రొడ్యూస్ చేసిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించా. కానీ విజయ్కు సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ట్రోల్ చేయడం కోసం చాలామందికి డబ్బులు ఇస్తు్నట్లు తెలిసి షాకయ్యాను. విజయ్కి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అనిపించింది. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో ఏమో నాకు తెలియదు. నేను మాత్రం ఇక్కడితో దీన్ని ఆపేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత ముఖ్యం’’ అని అనసూయ వివరించింది.
This post was last modified on June 9, 2023 1:02 pm
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…