మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో భోళా శంకర్ ప్రమోషన్ ని మొదలుపెట్టేశారు. ప్రస్తుతం సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఒక కీలక సాంగ్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఈ చిత్రీకరణ తాలూకు మేకింగ్ వీడియోని ఇన్స్ టాలో షేర్ చేస్తానని ముందే చెప్పిన చిరు దానికి తగ్గట్టే వీడియోని వదిలారు. హీరోయిన్ తమన్నా, చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్, బావ సుశాంత్ లతో పాటు కమెడియన్లు హైపర్ ఆది, రఘుబాబు తదితరులంతా ఇందులో భాగమయ్యారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన పాటకు చివర్లో డాన్స్ మొదలుపెట్టడంతో ఆపేశారు.
వేదాళం రీమేక్ గా ఇప్పటికీ నెగటివిటీని మూటగట్టుకున్న భోళా శంకర్ కు ఫస్ట్ ఆడియో సింగ్ మిశ్రమ స్పందన దక్కింది. రొటీన్ గా ఉందని కొందరు, మెల్లగా ఎక్కేస్తుందని మరికొందరు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు. సో కంటెంట్ ఏదో బలంగా ఉందని చెప్పాలంటే ఇలాంటి మేకింగ్ వీడియోలు వదలడం అవసరమే. చిరు, కీర్తి సురేష్, తమన్నాల మధ్య బాండింగ్ ఆకట్టుకునేలాగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ చూస్తుంటే అన్నయ్య నాటి చిరంజీవి గుర్తుకు వచ్చారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. వెనకాల ట్యూన్ రెగ్యులర్ గానే అనిపిస్తోంది.
ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న భోళా శంకర్ ఈ పాట షూట్ నిన్నటితో మొదలుపెట్టి జూన్ 11 దాకా మెయిన్ క్యాస్టింగ్ మొత్తం మీద జరగనుంది. ఇది పూర్తయ్యాక ఇంకో షెడ్యూల్ తో మొత్తం టాకీ పార్ట్ ఫినిష్ అవుతుందని టాక్. గత ఏడాది గాడ్ ఫాదర్ విషయంలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన చిరు ఇప్పుడు మరో రీమేక్ మీద ఆధారపడుతున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి స్ట్రెయిట్ కథలతో బ్లాక్ బస్టర్లు కొడితేనే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతామని అంటున్నారు. మెహర్ రమేష్ కి సైతం ఇది డూ ఆర్ డై పరిస్థితే. యానిమల్, జైలర్, గదర్ 2లతో భోళా శంకర్ పోటీ పడనుంది.
This post was last modified on June 8, 2023 9:59 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…