ఈ వేసవిలో భారీ చిత్రాల సందడి లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయిందనే చెప్పాలి. థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ.. ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేని వేసవి బహుశా ఇదేనేమో. మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసినవి తక్కువే. దసరా, విరూపాక్ష మాత్రమే బాగా డబ్బులు చేసుకున్నాయి. సరైన వినోదం లేక ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ వేసవిలో. ‘విరూపాక్ష’ తర్వాత అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ప్రతి వారం ఒకటికి మించి సినిమాలు రిలీజవుతున్నా.. ఏవీ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. థియేటర్లను కళకళలాడించలేకపోయాయి. ఓ మోస్తరు సినిమా కూడా లేక ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత వారం వచ్చిన అహింస, నేను స్టూడెంట్ సర్ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.
ఇలాంటి టైంలో కాస్త క్రేజున్న సినిమా పడి, మంచి టాక్ తెచ్చుకుంటే వసూళ్ల పంట పండించుకోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. అనుష్క, నవీన్ పొలిశెట్టిల క్రేజీ కలయికలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల కోసం కష్టపడాల్సిన పని లేదు. ప్రేక్షకులు కూడా ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రామిసింగ్గా కనిపిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వచ్చేవి. సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఎందుకో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎంతకీ ఖరారవ్వట్లేదు. బిజినెస్ కూడా దాదాపు పూర్తయినట్లు చెబుతున్నారు కానీ.. రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో మరి?
This post was last modified on June 8, 2023 6:23 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…