ఈ వేసవిలో భారీ చిత్రాల సందడి లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయిందనే చెప్పాలి. థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ.. ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేని వేసవి బహుశా ఇదేనేమో. మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసినవి తక్కువే. దసరా, విరూపాక్ష మాత్రమే బాగా డబ్బులు చేసుకున్నాయి. సరైన వినోదం లేక ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ వేసవిలో. ‘విరూపాక్ష’ తర్వాత అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ప్రతి వారం ఒకటికి మించి సినిమాలు రిలీజవుతున్నా.. ఏవీ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. థియేటర్లను కళకళలాడించలేకపోయాయి. ఓ మోస్తరు సినిమా కూడా లేక ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత వారం వచ్చిన అహింస, నేను స్టూడెంట్ సర్ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.
ఇలాంటి టైంలో కాస్త క్రేజున్న సినిమా పడి, మంచి టాక్ తెచ్చుకుంటే వసూళ్ల పంట పండించుకోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. అనుష్క, నవీన్ పొలిశెట్టిల క్రేజీ కలయికలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల కోసం కష్టపడాల్సిన పని లేదు. ప్రేక్షకులు కూడా ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రామిసింగ్గా కనిపిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వచ్చేవి. సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఎందుకో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎంతకీ ఖరారవ్వట్లేదు. బిజినెస్ కూడా దాదాపు పూర్తయినట్లు చెబుతున్నారు కానీ.. రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో మరి?
This post was last modified on June 8, 2023 6:23 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…