ఈ వేసవిలో భారీ చిత్రాల సందడి లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయిందనే చెప్పాలి. థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ.. ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేని వేసవి బహుశా ఇదేనేమో. మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసినవి తక్కువే. దసరా, విరూపాక్ష మాత్రమే బాగా డబ్బులు చేసుకున్నాయి. సరైన వినోదం లేక ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ వేసవిలో. ‘విరూపాక్ష’ తర్వాత అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ప్రతి వారం ఒకటికి మించి సినిమాలు రిలీజవుతున్నా.. ఏవీ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. థియేటర్లను కళకళలాడించలేకపోయాయి. ఓ మోస్తరు సినిమా కూడా లేక ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత వారం వచ్చిన అహింస, నేను స్టూడెంట్ సర్ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.
ఇలాంటి టైంలో కాస్త క్రేజున్న సినిమా పడి, మంచి టాక్ తెచ్చుకుంటే వసూళ్ల పంట పండించుకోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. అనుష్క, నవీన్ పొలిశెట్టిల క్రేజీ కలయికలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల కోసం కష్టపడాల్సిన పని లేదు. ప్రేక్షకులు కూడా ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రామిసింగ్గా కనిపిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వచ్చేవి. సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఎందుకో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎంతకీ ఖరారవ్వట్లేదు. బిజినెస్ కూడా దాదాపు పూర్తయినట్లు చెబుతున్నారు కానీ.. రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో మరి?
This post was last modified on June 8, 2023 6:23 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…