ఈ వేసవిలో భారీ చిత్రాల సందడి లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయిందనే చెప్పాలి. థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ.. ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేని వేసవి బహుశా ఇదేనేమో. మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసినవి తక్కువే. దసరా, విరూపాక్ష మాత్రమే బాగా డబ్బులు చేసుకున్నాయి. సరైన వినోదం లేక ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ వేసవిలో. ‘విరూపాక్ష’ తర్వాత అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ప్రతి వారం ఒకటికి మించి సినిమాలు రిలీజవుతున్నా.. ఏవీ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. థియేటర్లను కళకళలాడించలేకపోయాయి. ఓ మోస్తరు సినిమా కూడా లేక ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత వారం వచ్చిన అహింస, నేను స్టూడెంట్ సర్ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.
ఇలాంటి టైంలో కాస్త క్రేజున్న సినిమా పడి, మంచి టాక్ తెచ్చుకుంటే వసూళ్ల పంట పండించుకోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. అనుష్క, నవీన్ పొలిశెట్టిల క్రేజీ కలయికలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల కోసం కష్టపడాల్సిన పని లేదు. ప్రేక్షకులు కూడా ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రామిసింగ్గా కనిపిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వచ్చేవి. సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఎందుకో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎంతకీ ఖరారవ్వట్లేదు. బిజినెస్ కూడా దాదాపు పూర్తయినట్లు చెబుతున్నారు కానీ.. రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో మరి?
This post was last modified on June 8, 2023 6:23 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…