Movie News

జనగణమన జోడికి ఇలా కలిసొచ్చింది

ఖుషిని పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వెంటనే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో బిజీ అయిపోతాడు. లైగర్ కొట్టిన దెబ్బ చిన్నది కాకపోవడంతో ఆ షాక్ నుంచి బయటికి రావడానికి కొంత టైం తీసుకున్న రౌడీ హీరో నిర్మాత దిల్ రాజు దర్శకుడు పరశురామ్ తో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఒకేసారి డబుల్ షూటింగులు సమాంతరంగా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట. ఖుషి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కాబట్టి 2024లో ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ప్రథమార్థంలో మరొకటి ద్వితీయార్థంలో వస్తుందన్న మాట.

ఇక పరశురామ్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఆ లాంఛనం త్వరలోనే చేస్తారట. ఈ జోడి గతంలోనే కుదరాల్సింది. పూరి జగన్నాధ్ ప్లాన్ చేసుకున్న జనగణమనలో ముందు పూజానే తీసుకుని అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. కానీ లైగర్ డిజాస్టర్ ఈ ప్లానింగ్ మొత్తాన్ని చెడగొట్టింది. ప్రీ ప్రొడక్షన్ కి కోట్లు ఖర్చైనా సరే నిర్మాణ సంస్థ దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఆ కారణంగా పూజా హెగ్డే డేట్స్ కొన్ని వృధా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దేవరకొండతో జోడి అంటే ఛాన్స్ కొట్టేసినట్టే

సమంతా, పూజా హెగ్డే ఇలా సీనియర్ స్టార్ హీరోయిన్లతో జట్టు కడుతున్న విజయ్ దేవరకొండ ఇకపై రిస్కులకు దూరంగా అన్ని జానర్లు చేయాలని ఫిక్స్ అయ్యాడు. పదే పదే ఓవర్ అగ్రెసివ్ హీరోయిజం పని చేయడం లేదని గుర్తించి ఖుషిలో లవర్ బాయ్, గౌతమ్ తిన్ననూరిలో పోలీస్ ఆఫీసర్ కం గూడచారి ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. పరశురామ్ తో చేయబోయే సినిమా తాలూకు లీక్ మాత్రం ఇంకా బయటికి రాలేదు. సదరు దర్శకుడికి ఇతర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకున్న వ్యవహారం సెటిలయ్యాక సినిమాకు సంబంధించిన వార్తలు మొదలవుతాయి 

This post was last modified on June 8, 2023 5:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు: రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెస్తామ‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రాన్ని నాశ‌నం చేశార‌ని.. దీంతో…

5 minutes ago

జ‌గ‌న్‌కు భ‌యం తెలీదు: వైసీపీ పంచాంగం!

శ్రీవిశ్వావ‌సు నామ తెలుగు సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.…

1 hour ago

అర్ధరాత్రి వేళ సికందర్ పైరసీ కలకలం

ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…

1 hour ago

‘పేద‌ల‌కు ఉగాది’.. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉగాదిని పుర‌స్క‌రించుకుని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్ర‌ధంగా వ‌చ్చే ఉగాదిని పుర‌స్క‌రించుకుని…

2 hours ago

అమరావతికి తిరుగు లేదు… ఆరోసారీ సీఎంగా చంద్రబాబు

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…

3 hours ago

17 కత్తిరింపులతో ఎంపురాన్ కొత్త రూపం

అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…

3 hours ago