Movie News

జనగణమన జోడికి ఇలా కలిసొచ్చింది

ఖుషిని పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వెంటనే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో బిజీ అయిపోతాడు. లైగర్ కొట్టిన దెబ్బ చిన్నది కాకపోవడంతో ఆ షాక్ నుంచి బయటికి రావడానికి కొంత టైం తీసుకున్న రౌడీ హీరో నిర్మాత దిల్ రాజు దర్శకుడు పరశురామ్ తో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఒకేసారి డబుల్ షూటింగులు సమాంతరంగా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట. ఖుషి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కాబట్టి 2024లో ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ప్రథమార్థంలో మరొకటి ద్వితీయార్థంలో వస్తుందన్న మాట.

ఇక పరశురామ్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఆ లాంఛనం త్వరలోనే చేస్తారట. ఈ జోడి గతంలోనే కుదరాల్సింది. పూరి జగన్నాధ్ ప్లాన్ చేసుకున్న జనగణమనలో ముందు పూజానే తీసుకుని అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. కానీ లైగర్ డిజాస్టర్ ఈ ప్లానింగ్ మొత్తాన్ని చెడగొట్టింది. ప్రీ ప్రొడక్షన్ కి కోట్లు ఖర్చైనా సరే నిర్మాణ సంస్థ దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఆ కారణంగా పూజా హెగ్డే డేట్స్ కొన్ని వృధా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దేవరకొండతో జోడి అంటే ఛాన్స్ కొట్టేసినట్టే

సమంతా, పూజా హెగ్డే ఇలా సీనియర్ స్టార్ హీరోయిన్లతో జట్టు కడుతున్న విజయ్ దేవరకొండ ఇకపై రిస్కులకు దూరంగా అన్ని జానర్లు చేయాలని ఫిక్స్ అయ్యాడు. పదే పదే ఓవర్ అగ్రెసివ్ హీరోయిజం పని చేయడం లేదని గుర్తించి ఖుషిలో లవర్ బాయ్, గౌతమ్ తిన్ననూరిలో పోలీస్ ఆఫీసర్ కం గూడచారి ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. పరశురామ్ తో చేయబోయే సినిమా తాలూకు లీక్ మాత్రం ఇంకా బయటికి రాలేదు. సదరు దర్శకుడికి ఇతర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకున్న వ్యవహారం సెటిలయ్యాక సినిమాకు సంబంధించిన వార్తలు మొదలవుతాయి 

This post was last modified on June 8, 2023 5:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

24 minutes ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

5 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

6 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

6 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

6 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

7 hours ago