ఖుషిని పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వెంటనే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో బిజీ అయిపోతాడు. లైగర్ కొట్టిన దెబ్బ చిన్నది కాకపోవడంతో ఆ షాక్ నుంచి బయటికి రావడానికి కొంత టైం తీసుకున్న రౌడీ హీరో నిర్మాత దిల్ రాజు దర్శకుడు పరశురామ్ తో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఒకేసారి డబుల్ షూటింగులు సమాంతరంగా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట. ఖుషి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కాబట్టి 2024లో ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ప్రథమార్థంలో మరొకటి ద్వితీయార్థంలో వస్తుందన్న మాట.
ఇక పరశురామ్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఆ లాంఛనం త్వరలోనే చేస్తారట. ఈ జోడి గతంలోనే కుదరాల్సింది. పూరి జగన్నాధ్ ప్లాన్ చేసుకున్న జనగణమనలో ముందు పూజానే తీసుకుని అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. కానీ లైగర్ డిజాస్టర్ ఈ ప్లానింగ్ మొత్తాన్ని చెడగొట్టింది. ప్రీ ప్రొడక్షన్ కి కోట్లు ఖర్చైనా సరే నిర్మాణ సంస్థ దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఆ కారణంగా పూజా హెగ్డే డేట్స్ కొన్ని వృధా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దేవరకొండతో జోడి అంటే ఛాన్స్ కొట్టేసినట్టే
సమంతా, పూజా హెగ్డే ఇలా సీనియర్ స్టార్ హీరోయిన్లతో జట్టు కడుతున్న విజయ్ దేవరకొండ ఇకపై రిస్కులకు దూరంగా అన్ని జానర్లు చేయాలని ఫిక్స్ అయ్యాడు. పదే పదే ఓవర్ అగ్రెసివ్ హీరోయిజం పని చేయడం లేదని గుర్తించి ఖుషిలో లవర్ బాయ్, గౌతమ్ తిన్ననూరిలో పోలీస్ ఆఫీసర్ కం గూడచారి ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. పరశురామ్ తో చేయబోయే సినిమా తాలూకు లీక్ మాత్రం ఇంకా బయటికి రాలేదు. సదరు దర్శకుడికి ఇతర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకున్న వ్యవహారం సెటిలయ్యాక సినిమాకు సంబంధించిన వార్తలు మొదలవుతాయి
This post was last modified on June 8, 2023 5:22 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…