ఈ ఏడాది సమ్మర్ సినిమాలు ఆశించిన స్థాయిలో భారీ విజయాలు అందుకోలేదు. సాయి తేజ్ ‘విరూపాక్ష’ మినహా మిగతా సినిమాలు ఊహించిన స్థాయిలో సౌండ్ చేయలేదు. ‘మేమ్ ఫేమస్’ కూడా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకొని ఓ మోస్తరు కలెక్షన్స్ అందుకుంది తప్ప సూపర్ హిట్ దిశగా అడుగులు వేయలేదు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ ‘ఆదిపురుష్’ పైనే ఉన్నాయి. ఈ సినిమా టీజర్ పై కొంత నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత ట్రైలర్ ఆకట్టుకుంది. అక్కడి నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో రూపొందిన సినిమా అయినప్పటికీ ఆ టెక్నాలజీ ను పర్ఫెక్ట్ గా వాడుకున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక “జై శ్రీరామ్” సాంగ్ , తిరుపతిలో భారీ ఈవెంట్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే కంటెంట్ ఏ మాత్రం బాగున్నా ప్రభాస్ ఆది పురుష్ తో వరల్డ్ వైడ్ గా అద్భుతం చేయడం పక్కా అనిపిస్తుంది. నార్త్ లో ప్రభాస్ కి ‘బాహుబలి’ , ‘సాహో’ సినిమాలు తెచ్చిన ఇమేజ్ తో పాటు రామజపంతో అక్కడ మంచి కలెక్షన్స్ తెచ్చే అవకాశం ఉంది.
కాకపోతే స్కూల్ ఓపెన్ అయ్యాక రిలీజ్ అవుతుండటం కొంత ఎఫెక్ట్ పడనుంది. సమ్మర్ హాలిడేస్ లో అయితే పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండేది. మరి చూడాలి రామాయణంలోని ముఖ్య భాగంతో ఓం రౌత్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ వసూళ్లు అందుకుంటుందో ?
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…