తిరుపతి లో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున ప్రభాస్ అభిమానులు , మూవీ లవర్స్ ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే టీం ముందు నుండి ఈవెంట్ కి తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసి ఎక్కడా సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారు. కార్యక్రమంలో ప్రభాస్ ధనుస్సు పట్టుకోవడం హైలైట్ గా నిలిచింది. అలాగే తిరుపతిలో అయోధ్య సెట్ కూడా ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిల్లలతో పెర్ఫార్మెన్స్ , గ్రూప్ సింగర్స్ తో జై శ్రీరామ్ అంటూ హొరెత్తేలా పాడించడం , వచ్చిన అందరికీ ప్రాంగణంలో సరిపడేలా ప్లాన్ చేయడం ఇలా అన్నీ బాగా కుదిరాయి.
రెగ్యులర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా కాకుండా సినిమాకి తగ్గట్టుగా ప్లాన్ చేశారు. దీని వెనుక హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కష్టం ఉంది. షో ప్రోమోస్ , భారీ సెట్టింగ్స్ , స్పెషల్ డిజైనింగ్ , ఈవెంట్ ఐడియాలు వీటికి ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో ఫేమస్. అందుకే ప్రభాస్ , యూవీ కోసం ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. రెండు మూడు వారాలుగా ఈవెంట్ కోసం ప్లానింగ్ రెడీ చేసి రెండ్రోజుల ముందే తిరుపతి వెళ్ళి ఏర్పాట్లు చూసుకున్నాడు. అందుకే ప్రభాస్ స్పీచ్ లో ప్రశాంత వర్మ కి థాంక్స్ చెప్పుకున్నాడు.
రామాయణంలో శ్రీరాముడికి హనుమాన్ సాయం చేస్తే, శ్రీరాముడి కథతో వస్తున్న ఆదిపురుష్ ఈవెంట్ కి హనుమాన్ దర్శకుడు సాయం అందించి ఈవెంట్ సక్సెస్ అయ్యేలా కృషి చేయడం విశేషం.
This post was last modified on June 8, 2023 9:05 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…