తిరుపతి లో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున ప్రభాస్ అభిమానులు , మూవీ లవర్స్ ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే టీం ముందు నుండి ఈవెంట్ కి తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసి ఎక్కడా సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారు. కార్యక్రమంలో ప్రభాస్ ధనుస్సు పట్టుకోవడం హైలైట్ గా నిలిచింది. అలాగే తిరుపతిలో అయోధ్య సెట్ కూడా ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిల్లలతో పెర్ఫార్మెన్స్ , గ్రూప్ సింగర్స్ తో జై శ్రీరామ్ అంటూ హొరెత్తేలా పాడించడం , వచ్చిన అందరికీ ప్రాంగణంలో సరిపడేలా ప్లాన్ చేయడం ఇలా అన్నీ బాగా కుదిరాయి.
రెగ్యులర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా కాకుండా సినిమాకి తగ్గట్టుగా ప్లాన్ చేశారు. దీని వెనుక హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కష్టం ఉంది. షో ప్రోమోస్ , భారీ సెట్టింగ్స్ , స్పెషల్ డిజైనింగ్ , ఈవెంట్ ఐడియాలు వీటికి ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో ఫేమస్. అందుకే ప్రభాస్ , యూవీ కోసం ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. రెండు మూడు వారాలుగా ఈవెంట్ కోసం ప్లానింగ్ రెడీ చేసి రెండ్రోజుల ముందే తిరుపతి వెళ్ళి ఏర్పాట్లు చూసుకున్నాడు. అందుకే ప్రభాస్ స్పీచ్ లో ప్రశాంత వర్మ కి థాంక్స్ చెప్పుకున్నాడు.
రామాయణంలో శ్రీరాముడికి హనుమాన్ సాయం చేస్తే, శ్రీరాముడి కథతో వస్తున్న ఆదిపురుష్ ఈవెంట్ కి హనుమాన్ దర్శకుడు సాయం అందించి ఈవెంట్ సక్సెస్ అయ్యేలా కృషి చేయడం విశేషం.
This post was last modified on June 8, 2023 9:05 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…