తిరుపతి లో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున ప్రభాస్ అభిమానులు , మూవీ లవర్స్ ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే టీం ముందు నుండి ఈవెంట్ కి తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసి ఎక్కడా సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారు. కార్యక్రమంలో ప్రభాస్ ధనుస్సు పట్టుకోవడం హైలైట్ గా నిలిచింది. అలాగే తిరుపతిలో అయోధ్య సెట్ కూడా ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిల్లలతో పెర్ఫార్మెన్స్ , గ్రూప్ సింగర్స్ తో జై శ్రీరామ్ అంటూ హొరెత్తేలా పాడించడం , వచ్చిన అందరికీ ప్రాంగణంలో సరిపడేలా ప్లాన్ చేయడం ఇలా అన్నీ బాగా కుదిరాయి.
రెగ్యులర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా కాకుండా సినిమాకి తగ్గట్టుగా ప్లాన్ చేశారు. దీని వెనుక హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కష్టం ఉంది. షో ప్రోమోస్ , భారీ సెట్టింగ్స్ , స్పెషల్ డిజైనింగ్ , ఈవెంట్ ఐడియాలు వీటికి ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో ఫేమస్. అందుకే ప్రభాస్ , యూవీ కోసం ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. రెండు మూడు వారాలుగా ఈవెంట్ కోసం ప్లానింగ్ రెడీ చేసి రెండ్రోజుల ముందే తిరుపతి వెళ్ళి ఏర్పాట్లు చూసుకున్నాడు. అందుకే ప్రభాస్ స్పీచ్ లో ప్రశాంత వర్మ కి థాంక్స్ చెప్పుకున్నాడు.
రామాయణంలో శ్రీరాముడికి హనుమాన్ సాయం చేస్తే, శ్రీరాముడి కథతో వస్తున్న ఆదిపురుష్ ఈవెంట్ కి హనుమాన్ దర్శకుడు సాయం అందించి ఈవెంట్ సక్సెస్ అయ్యేలా కృషి చేయడం విశేషం.
This post was last modified on June 8, 2023 9:05 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…