‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ల జోరు పెంచుతోంది చిత్ర బృందం. మంగళవారమే తిరుపతిలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. అంతకు ఒక్క రోజు ముందే చిత్ర బృందం వేసిన ప్రమోషన్ ఎత్తుగడ చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా ఆడబోయే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ను ఖాళీగా ఉంచబోతున్నామని.. అది హనుమంతుడి కోసం కేటాయిస్తున్నామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ పట్ల ప్రేక్షకుల్లో భక్తి భావాన్ని, ఉద్వేగాన్ని పెంచే ఉద్దేశంతో టీం ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఆలోచనను కొందరు స్వాగతించగా.. ఇంకొందరు మాత్రం దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో.
హనుమంతుడి కోసం సీట్ కేటాయించడం వెటకారాలాడుతూ చాలా మీమ్సే పడుతున్నాయి సోషల్ మీడియాలో. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో లేని తన అసిస్టెంట్ను ఉన్నట్లు ఊహించుకునే వెన్నెల కిషోర్తో బ్రహ్మానందం తంటాలు పడే సీన్.. అలాగే ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తనకు మాత్రమే కనిపించే హనుమంతుడితో నితిన్ మాట్లాడుతూ మిగతా వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశం.. ఇలాంటివి పట్టుకొచ్చి ‘ఆదిపురుష్’ టీంను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇంకా రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. పాత రోజుల్లో అయితే ఇలాంటి ఐడియాలకు జనాలు పడిపోయి ఎమోషనల్ అయిపోయేవారని.. ఈ రోజుల్లో ఇలాంటి వర్కవుట్ కావని కొందరు విమర్శిస్తుండగా.. కొందరు మాత్రం ఇది కచ్చితంగా వర్కవుట్ అయ్యే ఐడియా అని.. ‘ఆదిపురుష్’ను ఒక వర్గం బాగా ఓన్ చేసుకుంటుందని అంటున్నారు.
This post was last modified on June 6, 2023 7:01 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…