‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ల జోరు పెంచుతోంది చిత్ర బృందం. మంగళవారమే తిరుపతిలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. అంతకు ఒక్క రోజు ముందే చిత్ర బృందం వేసిన ప్రమోషన్ ఎత్తుగడ చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా ఆడబోయే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ను ఖాళీగా ఉంచబోతున్నామని.. అది హనుమంతుడి కోసం కేటాయిస్తున్నామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ పట్ల ప్రేక్షకుల్లో భక్తి భావాన్ని, ఉద్వేగాన్ని పెంచే ఉద్దేశంతో టీం ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఆలోచనను కొందరు స్వాగతించగా.. ఇంకొందరు మాత్రం దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో.
హనుమంతుడి కోసం సీట్ కేటాయించడం వెటకారాలాడుతూ చాలా మీమ్సే పడుతున్నాయి సోషల్ మీడియాలో. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో లేని తన అసిస్టెంట్ను ఉన్నట్లు ఊహించుకునే వెన్నెల కిషోర్తో బ్రహ్మానందం తంటాలు పడే సీన్.. అలాగే ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తనకు మాత్రమే కనిపించే హనుమంతుడితో నితిన్ మాట్లాడుతూ మిగతా వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశం.. ఇలాంటివి పట్టుకొచ్చి ‘ఆదిపురుష్’ టీంను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇంకా రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. పాత రోజుల్లో అయితే ఇలాంటి ఐడియాలకు జనాలు పడిపోయి ఎమోషనల్ అయిపోయేవారని.. ఈ రోజుల్లో ఇలాంటి వర్కవుట్ కావని కొందరు విమర్శిస్తుండగా.. కొందరు మాత్రం ఇది కచ్చితంగా వర్కవుట్ అయ్యే ఐడియా అని.. ‘ఆదిపురుష్’ను ఒక వర్గం బాగా ఓన్ చేసుకుంటుందని అంటున్నారు.
This post was last modified on June 6, 2023 7:01 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…