‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ల జోరు పెంచుతోంది చిత్ర బృందం. మంగళవారమే తిరుపతిలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. అంతకు ఒక్క రోజు ముందే చిత్ర బృందం వేసిన ప్రమోషన్ ఎత్తుగడ చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా ఆడబోయే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ను ఖాళీగా ఉంచబోతున్నామని.. అది హనుమంతుడి కోసం కేటాయిస్తున్నామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ పట్ల ప్రేక్షకుల్లో భక్తి భావాన్ని, ఉద్వేగాన్ని పెంచే ఉద్దేశంతో టీం ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఆలోచనను కొందరు స్వాగతించగా.. ఇంకొందరు మాత్రం దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో.
హనుమంతుడి కోసం సీట్ కేటాయించడం వెటకారాలాడుతూ చాలా మీమ్సే పడుతున్నాయి సోషల్ మీడియాలో. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో లేని తన అసిస్టెంట్ను ఉన్నట్లు ఊహించుకునే వెన్నెల కిషోర్తో బ్రహ్మానందం తంటాలు పడే సీన్.. అలాగే ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తనకు మాత్రమే కనిపించే హనుమంతుడితో నితిన్ మాట్లాడుతూ మిగతా వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశం.. ఇలాంటివి పట్టుకొచ్చి ‘ఆదిపురుష్’ టీంను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇంకా రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. పాత రోజుల్లో అయితే ఇలాంటి ఐడియాలకు జనాలు పడిపోయి ఎమోషనల్ అయిపోయేవారని.. ఈ రోజుల్లో ఇలాంటి వర్కవుట్ కావని కొందరు విమర్శిస్తుండగా.. కొందరు మాత్రం ఇది కచ్చితంగా వర్కవుట్ అయ్యే ఐడియా అని.. ‘ఆదిపురుష్’ను ఒక వర్గం బాగా ఓన్ చేసుకుంటుందని అంటున్నారు.
This post was last modified on June 6, 2023 7:01 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…