‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ల జోరు పెంచుతోంది చిత్ర బృందం. మంగళవారమే తిరుపతిలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. అంతకు ఒక్క రోజు ముందే చిత్ర బృందం వేసిన ప్రమోషన్ ఎత్తుగడ చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా ఆడబోయే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ను ఖాళీగా ఉంచబోతున్నామని.. అది హనుమంతుడి కోసం కేటాయిస్తున్నామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ పట్ల ప్రేక్షకుల్లో భక్తి భావాన్ని, ఉద్వేగాన్ని పెంచే ఉద్దేశంతో టీం ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఆలోచనను కొందరు స్వాగతించగా.. ఇంకొందరు మాత్రం దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో.
హనుమంతుడి కోసం సీట్ కేటాయించడం వెటకారాలాడుతూ చాలా మీమ్సే పడుతున్నాయి సోషల్ మీడియాలో. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో లేని తన అసిస్టెంట్ను ఉన్నట్లు ఊహించుకునే వెన్నెల కిషోర్తో బ్రహ్మానందం తంటాలు పడే సీన్.. అలాగే ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తనకు మాత్రమే కనిపించే హనుమంతుడితో నితిన్ మాట్లాడుతూ మిగతా వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశం.. ఇలాంటివి పట్టుకొచ్చి ‘ఆదిపురుష్’ టీంను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇంకా రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. పాత రోజుల్లో అయితే ఇలాంటి ఐడియాలకు జనాలు పడిపోయి ఎమోషనల్ అయిపోయేవారని.. ఈ రోజుల్లో ఇలాంటి వర్కవుట్ కావని కొందరు విమర్శిస్తుండగా.. కొందరు మాత్రం ఇది కచ్చితంగా వర్కవుట్ అయ్యే ఐడియా అని.. ‘ఆదిపురుష్’ను ఒక వర్గం బాగా ఓన్ చేసుకుంటుందని అంటున్నారు.
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…