ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరి దృష్టీ ‘ఆదిపురుష్’ మీదే ఉంది. ఆ మాటకొస్తే భారతీయ సినీ ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిదే. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజైనపుడు ఈ సినిమాపై విపరీతమైన నెగెటివిటీ కనిపించగా.. ట్రైలర్ ఆ నెగెటివిటీని చాలా వరకు తగ్గించేసింది.
సినిమాకు మళ్లీ మంచి హైప్ కనిపిస్తోంది. ఈ హైప్ను వేరే లెవెల్కు తీసుకెళ్లేలా తిరుపతి వేదికగా మంగళవారం భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఎస్వీ యూనివర్శిటీ మైదానంలో ఈ వేడుకను కనీ వినీ ఎరుగని రీతిలో చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రభాస్తో పాటు యూనిట్లోని ముఖ్య సభ్యులందరూ హాజరు కానున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.
కాగా ‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్కు ఎవరూ ఊహించని ఒక విశిష్ట అతిథి రాబోతున్నారు. ఆయనే.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి. ఒక సినిమా వేడుకకు ఇలాంటి అతిథి రావడం అరుదైన విషయమే. ఈ వేడుకలో ప్రభాస్ తర్వాత అందరి దృష్గినీ ఆకర్షించేది ఆయనే అనడంలో సందేహం లేదు. ‘ఆదిపురుష్’ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో.. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా హిందువులందరికీ చేరువ చేసేందుకు చిత్ర బృందం గట్టి ప్రయత్నమే చేస్తోంది.
టీజర్ రిలీజైనపుడు హిందూ మద్దతుదారుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ సహా అన్ని విషయాల్లోనూ కరెక్షన్లు చేయడమే కాక.. ఈ సినిమాను వ్యతిరేకించిన కొందరు రాజకీయ నాయకులను కూడా చిత్ర బృందం కలిసి సినిమాకు సపోర్ట్ తెచ్చుకుంది. ఇప్పుడు చినజీయర్ స్వామి లాంటి వ్యక్తిని ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా పిలిచిన హిందువుల్లో సినిమా పట్ల మరింత సానుకూలత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి…
దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ…
బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని…
కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే…
సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు…
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ…