ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరి దృష్టీ ‘ఆదిపురుష్’ మీదే ఉంది. ఆ మాటకొస్తే భారతీయ సినీ ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిదే. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజైనపుడు ఈ సినిమాపై విపరీతమైన నెగెటివిటీ కనిపించగా.. ట్రైలర్ ఆ నెగెటివిటీని చాలా వరకు తగ్గించేసింది.
సినిమాకు మళ్లీ మంచి హైప్ కనిపిస్తోంది. ఈ హైప్ను వేరే లెవెల్కు తీసుకెళ్లేలా తిరుపతి వేదికగా మంగళవారం భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఎస్వీ యూనివర్శిటీ మైదానంలో ఈ వేడుకను కనీ వినీ ఎరుగని రీతిలో చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రభాస్తో పాటు యూనిట్లోని ముఖ్య సభ్యులందరూ హాజరు కానున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.
కాగా ‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్కు ఎవరూ ఊహించని ఒక విశిష్ట అతిథి రాబోతున్నారు. ఆయనే.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి. ఒక సినిమా వేడుకకు ఇలాంటి అతిథి రావడం అరుదైన విషయమే. ఈ వేడుకలో ప్రభాస్ తర్వాత అందరి దృష్గినీ ఆకర్షించేది ఆయనే అనడంలో సందేహం లేదు. ‘ఆదిపురుష్’ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో.. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా హిందువులందరికీ చేరువ చేసేందుకు చిత్ర బృందం గట్టి ప్రయత్నమే చేస్తోంది.
టీజర్ రిలీజైనపుడు హిందూ మద్దతుదారుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ సహా అన్ని విషయాల్లోనూ కరెక్షన్లు చేయడమే కాక.. ఈ సినిమాను వ్యతిరేకించిన కొందరు రాజకీయ నాయకులను కూడా చిత్ర బృందం కలిసి సినిమాకు సపోర్ట్ తెచ్చుకుంది. ఇప్పుడు చినజీయర్ స్వామి లాంటి వ్యక్తిని ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా పిలిచిన హిందువుల్లో సినిమా పట్ల మరింత సానుకూలత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…