సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఒక కుర్రాడితో డేటింగ్ చేస్తోందని.. వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇటీవల మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఐతే మీడియా వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి తన స్నేహితుడు మాత్రమే అని కీర్తి క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లు ఆగట్లేదు. చివరికి కీర్తి తల్లిదండ్రులు సైతం ఈ వార్తలపై స్పందించారు.
కీర్తి పెళ్లి కుదిరినపుడు తామే అధికారికంగా ప్రకటిస్తామని.. అంతవరకు ఇలాంటి ప్రచారాలు కట్టిపెట్టాలని మీడియాకు క్లాస్ పీకారు. అయినా సరే.. కీర్తి పెళ్లి గురించి మీడియా శూల శోధనలు ఆగట్లేదు. తాజాగా కీర్తి.. తమిళంలో నటించిన ‘మామన్నన్’కు సంబంధించి చెన్నైలో ఒక ప్రెస్ మీట్లో పాల్గొంది. ఇక్కడ కూడా మధ్యలో విలేకరులు కీర్తిని పెళ్లి గురించి ప్రశ్నించారు.
సినిమా ప్రెస్ మీట్లో వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న ఎదురవడంతో కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ‘‘నా పెళ్లిపై వస్తున్న రూమర్ల గురించి ఇప్పటికే నేను ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా దాని గురించే ఎందుకు అడుగుతున్నారు? ఆ విషయంపై ఎందుకింత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు? నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను.
దాని గురించి ప్రెస్ మీట్లలో ప్రతిసారీ అడగొద్దు. ఇలాంటి ప్రశ్నలు కాదు.. సినిమాకు సంబంధించినవి అడగండి’’ అని కీర్తి పేర్కొంది. పరియేరుం పెరుమాల్, కర్ణన్ లాంటి క్లాసిక్స్ తీసిన మారి సెల్వరాజ్ రూపొందించిన చిత్రం ‘మామన్నన్’. ఇందులో కీర్తితో పాటు వడివేలు, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. తెలుగులో కీర్తి.. చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో నటిస్తోంది. దీంతో పాటు ఆమె రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ లీడ్ రోల్ చేస్తోంది.
This post was last modified on June 4, 2023 1:28 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…