నిన్న విడుదలైన సినిమాల్లో యూత్ పరంగా అంతో ఇంతో బజ్ ఉన్నది ఒక్క పరేషాన్ మీదే. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించడంతో సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేగింది. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో మాసూద ఫేమ్ తిరువీర్ హీరోగా నటించాడు. అయితే పరేషాన్ టైటిల్ కు తగ్గట్టే నిర్మాతను రానాను ఖంగారు పెట్టించేలా ఉంది. రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ అంతంత మాత్రంగా ఉండటం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తోంది. నైజామ్ పరిస్థితి కొంత వరకు నయమనుకుంటే ఏపీలో మాత్రం మరీ నీరసంగా సాగుతోంది.
వయసొచ్చిన కుర్రాళ్ళ మధ్య స్నేహం, పార్టీ కల్చర్, బేవార్స్ తిరుగుళ్ళు, ఇంట్లో వాళ్లతో తిట్టించుకోవడం, అనక సమస్యలు కొని తెచ్చుకోవడం, వాటి పరిష్కారాల కోసం కిందా మీద పడటం ఇలా పరేషాన్ మొత్తం మనకు అలవాటైన బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అక్కడక్కడా పేలిపోయే జోకులు ఉన్నప్పటికీ సినిమా మొత్తాన్ని మోయడానికి అవి సరిపోలేదు. కేవలం ఫన్ సీన్స్ మీద ఆధారపడి కథాకథనాలను లైట్ తీసుకోవడంతో తేడా కొట్టేసింది. సెకండ్ హాఫ్ లో చాలా మటుకు భరించలేనంత ప్రహసనాన్ని జొప్పించాడు డైరెక్టర్ రూపక్ రొనాల్ట్ సన్.
తెలంగాణ యూత్ ని పదే పదే మందు బాబులుగా చూపించడం పట్ల సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. పరేషాన్ లో దీన్ని కాస్త ఓవర్ డోస్ చేసి చూపించడంతో కొత్త అనే అనుభూతి కలగదు. ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా సింపుల్ లైన్ మీద ఇంత ల్యాగ్ తో కంటెంట్ ప్రెజెంట్ చేయడం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఎంటర్ టైనింగ్ యాంగిల్ లో కనీసం మేం ఫేమస్ స్థాయిలో పరేషాన్ ఉన్నా దాని లాగే హిట్టయ్యే ఛాన్స్ ఉంది. కానీ పరేషాన్ కు అంత సీన్ లేకపోయింది. ఏదో అద్భుతం చేస్తుందనుకుని దగ్గరుండి ప్రమోషన్లు చేసిన రానాకు పెద్ద పరేషానే మిగిలింది
This post was last modified on June 3, 2023 4:02 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…